బద్దకస్తులు, ఎందుకు గెలిపించాలి: బాబుపై పవన్, నీపై గెలుస్తా: జనసేనానికి బుజ్జి సవాల్
విశాఖపట్నం/ఏలూరు: తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కార్మికులు, రైతులతో భేటీ అయ్యారు. అక్రమ క్వారీలు, ఇసుక మాఫియాకు స్థానిక నేతలు కొమ్ముగాస్తున్నారని ఆరోపించారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.
Recommended Video

తాను అనకాపల్లికి వస్తున్నానని తెలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షుగర్ ఫ్యాక్టరీపై సమీక్ష నిర్వహించారన్నారు. నెల రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకపోతే దీక్ష చేస్తానని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని సూచన చేశారు.

అవంతి శ్రీనివాస్ అలా అనడం బాధాకరం
షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సంక్షేమ నిధి కోసం తాము జనసేన పార్టీ తరఫున నిధులు సమీకరిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు బాధించాయని కూడా ఆయన అన్నారు. విశాఖ రైల్వే జోన్ లేదు గీను లేదు అనడం బాధాకరమన్నారు.

చంద్రబాబును మళ్లీ ఎందుకు గెలిపించాలి?
చంద్రబాబును తిరిగి ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలో చెప్పాలని పవన్ ప్రశ్నించారు. భూకుంభకోణాలపై సిట్ నివేదికను ఎందుకు బయటకు వెల్లడించలేదో చెప్పాలని నిలదీశారు. వారికి భాగస్వామ్యం ఉంది కాబట్టే బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీ తెరిపించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు.

మన ఎంపీలు బద్దకంగా ఉన్నారు
మన ఎంపీలు చాలా బద్ధకంగా ఉంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజా సమస్యలను వారు పట్టించుకోవడం లేదన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ తన ఉత్తరాంధ్ర పర్యటనలో పలువురిని కలుస్తున్నారు. మంగళవారం ఆయన అనకాపల్లిలో పర్యటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి పోటీ చేస్తే గెలుస్తా
పవన్ కళ్యాణ్కు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి సవాల్ విసిరారు. పవన్ ఏలూరు నుంచి పోటీ చేస్తే ఆయనపై తాను గెలుస్తానని వ్యాఖ్యానించారు. జనసేనానిపై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
-
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications