మావోయిస్టు చలపతి దంపతుల సెల్పీ ఈ పోటో ఆధారంగానే పోలీసుల ఆరా
విశాఖపట్నం :సుదీర్ఘ కాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన చలపతి పోటోలు పోలీసుల వద్ద లేవు.అయితే చలపతి ఆయన సతీమణి నాలుగు మాసాల క్రితం సెల్ ఫోన్ లో తీసుకొన్న సెల్పీ పోలీసులకు చిక్కింది.ఈ ఫోటో ఆధారంగా పోలీసులు వేట సాగించారు. ఈ సెల్పీ పోలీసులకు కొంత ప్రయోజనాన్ని కల్గించింది.టెక్నాలజీ మావోయిస్టులకు కొంత ఉపకరించినా....తమ ఉనికిని చాటేందుకు టెక్నాలజీ దోహదపడుతోందని మరోసారి రుజువైంది.
భార్యతో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ సెల్ఫీ, చిక్కుల్లో పడేసింది
మావోయిస్టు పార్టీ కోరాపుట్ - శ్రీకాకుళం డివిజన్ కమిటీకి డిప్యూటీ కమాండర్ గా వ్యవహారించిన చలపతి .ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా పనిచేసిన అరుణ లు కలిసి సెల్పీ దిగారు. ఈ సెల్పీ పోలీసులకు చిక్కే వరకు చలపతి, ఆయన సతీమణి అరుణ రూపురేఖలు పోలీసులకు తెలియదు.ఒడిశాలో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరిద్దరూ మరణించారు.

చలపతిపై 20 లక్షలు, అరుణపై 5 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది.ఏజెన్సీ ఏరియాలో వీరిద్దరూ యదేచ్చగా తిరిగేవారు.వీరి గుర్తించే ఫోటోలు పోలీసుల వద్ద లేకపోవడం వల్ల చలపతి దంపతులకు ఇబ్బందిలేకుండా పోయింది. వీరి పేరుతో ఉన్న మావోయిస్టుల కదలికలున్నా...వారిని గుర్తించలేకపోయేవారు.
స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించే చలపతి నాలుగు మాసాల క్రితం తన సతీమణి అరుణతో కలిసి సెల్పీ దిగారు.ఈ ఫోటోను అరుణ తన సోదరుడు ఆజాద్ కు పంపింది.ఈ ఫోటోను ఆజాద్ తన ల్యాప్ ట్చాస్ లో భద్రపర్చుకొన్నారు.ఈ ఏడాది మే 4వ, తేదిన కొయ్యూరు మండలంలోని మర్రిపాకలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆజాద్ మరణించారు.ఈ ల్యాప్ ట్యాప్ లో చలపతి సెల్పీ పోలీసులకు దొరికింది.ఈ సెల్పీ ఆధారంగానే పోస్టర్లను ముద్రించి పోలీసులు విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ ఘటనతో సెల్పీలు, స్మార్ట్ పోన్ల వినియోగం చేయకూడదని మావోయిస్టు అభిప్రాయపడింది.అయినా అప్పటికే నష్టం జరిగింది.ఈ సెల్పీ ఆధారంగానే ఒడిశా ఎన్ కౌంటర్ లో వీరిద్దరూ మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications