ఏపీలో కుల గణన మొదలుపెట్టేశారా ? తల్లికి వందనంలో కీలక నిర్ణయం..!
దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులేస్తోంది. గతంలో కుల గణనకు ససేమిరా అంటూ వచ్చిన కేంద్రం.. తాజాగా రూటు మార్చింది. జన గణన సమయంలోనే కుల గణన కూడా చేపట్టేందుకు అంగీకరంచింది. దీంతో విపక్షాల చిరకాల డిమాండ్ నెరవేరినట్లయింది. ఇదే క్రమంలో ఏపీలోనూ ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు కులగణన చేపట్టాల్సి ఉంది. అయితే అంతకు ముందే ఏపీ ప్రభుత్వం కులగణన దిశగా ఓ అడుగు వేసేసింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ఇచ్చిన తల్లికి వందనం పథకం హామీ నెరవేర్చేందుకు ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా మిగిలిన అన్ని మార్గదర్శకాలతో పాటు లబ్దిదారులు కులంతో పాటు ఉపకులం కూడా చెప్పాలని కోరింది. దీంతో ఈసారి జనాభా గణన సమయంలో చేసే కుల గణనలో అడిగే ఉప కులం వివరాలు అడుగుతున్నట్లు అవుతోంది. దీంతో రాష్ట్రంలో ముందే కుల గణన ప్రారంభమైందా అన్న చర్చ సాగుతోంది.

The @ncbn-led #NDA government in #AndhraPradesh has launched #Caste #Census by proxy while rolling out a #freebie scheme #TallikiVandanam for mothers. It is collecting religion, caste & sub-caste details of 67,27,164 students, turning into 42,69,459 families. pic.twitter.com/3nblwwXl7N
— సూర్య దేశరాజు SURYA DESARAJU (@foolscool) June 12, 2025
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ఇదే తల్లికి వందనం పథకం ప్రారంభించారు. అప్పట్లో ఐదేళ్ల పాటు అమలు చేసిన ఈ పథకం లబ్దిదారుల నుంచి కులం వివరాలు మాత్రమే అడిగేవారు. అంటే కేవలం జనరల్ (ఓసీ), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీయా అనే వివరాలు మాత్రమే అడిగేవారు. బీసీల్లో ఏ కులం, ఎస్సీ, ఎస్టీల్లో ఓ ఉపకులం అనే వివరాలు అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ వివరాలు కూడా చెప్పాలని తల్లికివందనం పథకం మార్గదర్శకాల్లో పేర్కొనడంతో ముందుగానే ఆ వివరాలు వెల్లడయ్యే అపకాశాలు కనిపిస్తున్నాయి.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం











Click it and Unblock the Notifications