పరిటాల రవి హత్యలో జగనే తొలి ముద్దాయి: సునీత
అనంతపురం/విజయవాడ: తన భర్త పరిటాల రవి హత్య కేసు పునర్విచారణ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతానని మంత్రి పరిటాల సునీత ఆదివారం తెలిపారు. రవి హత్య కేసు తిరిగి దర్యాఫ్తు చేపడితే జగనే మొదటి ముద్దాయిగా వెల్లడవుతుందన్నారు.
రవి హత్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన 80 శాతం మందిని దేవుడే శిక్షించాడన్నారు. పరిటాల వర్ధంతి సందర్భంగా తన కుమారుడు శ్రీరామ్ ఆధ్వర్యంలో ఘాట్ వద్ద 24న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో స్మార్ట్ విలేజ్ను ప్రారంభించిన దేవినేని

కృష్ణా జిల్లాలోని ఇబ్రహీపట్నంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు విశాఖలో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో మంత్రి దేవినేని కూడా మైలవరం వరకు పాదయాత్ర చేయనున్నారు.
31న జగన్ దీక్ష
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా తుణుకులో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నిరాహార దీక్ష చేస్తారని, దీనిని జయప్రదం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. నిరసనలో కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.












Click it and Unblock the Notifications