నంద్యాలపై ఆ హామీని జగన్ నిలబెట్టుకుంటారా? ఇప్పటికే బాబు పైచేయి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? అనే చర్చ సాగుతోంది.
Recommended Video
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? అనే చర్చ సాగుతోంది.
చదవండి: మీరు లేకుంటే..: శిల్బా బ్రదర్స్పై బాబు సెటైర్లు, వైసిపి కొట్లాటలపై ఇలా..
టిడిపికి పోటీగా ఇదీ జగన్ హామీ
వైసిపిలోను, ప్రధానంగా నంద్యాల వైసిపిలో జగన్ ఇచ్చిన హామీ పైన చర్చ సాగుతోందని తెలుస్తోంది. నంద్యాలలో ముస్లీం ఓటర్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో వారి ఓట్లు పొందేందుకు టిడిపి, వైసిపిలు ఎమ్మెల్సీ పదవిని ఎరవేశాయి. అప్పటికే టిడిపి ఫరూక్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వగా, తమకు రాబోయే ఎమ్మెల్సీ సీటును నంద్యాల మైనార్టీలకు ఇస్తామని జగన్ చెప్పారు.
జగన్ హామీని నిలబెట్టుకుంటారా
2018లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ ఎమ్మెల్సీ సీటు వస్తుందని, తానును నంద్యాల ముస్లీం నాయకుడికే ఇస్తామని జగన్ చెప్పారు. ఈ హామీని జగన్ నిలబెట్టుకుంటారా అనే చర్చ సాగుతోంది.
మైనార్టీ ఓట్లు టిడిపికే
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఘోర పరాజయం చవి చూశారు. పైగా, ముస్లీం ఓటర్లు కూడా టిడిపి వైపు మొగ్గు చూపినట్లు వైసిపి నేతలే చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ తన హామీని ఏ మేరకు నిలబెట్టుకుంటారనే గుసగుసలు వైసిపిలోనే కనిపిస్తున్నాయని అంటున్నారు.
నంద్యాల వైసిపి ఏమంటోంది?
పార్టీ గెలిచినా, ఓడినా ఇచ్చిన హామీ మేరకు జగన్ నంద్యాల మైనార్టీకి వచ్చే ఏడాది ఎమ్మెల్సీ సీటును ఇవ్వాలని వైసిపి నేతలు కోరుకుంటున్నారు. తాము గెలిపించకపోయినా.. జగన్ ఇచ్చిన హామీ మేరకు సీటు ఇచ్చారని భావించి, 2019 ఎన్నికల్లో మన వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కాబట్టి జగన్ ఇక్కడి నేతకే సీటు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.
ముందే ఇచ్చి, జగన్పై చంద్రబాబు పైచేయి
నంద్యాలలో మైనార్టీ ఓటర్లు టిడిపి వైపు మొగ్గు చూపారు. నంద్యాల మైనార్టీ నేత ఫరూక్కు ఇప్పటికే చంద్రబాబు ఎమ్మెల్సీని ఇచ్చారు. తద్వారా జగన్ కంటే ముందే తనకు వచ్చిన అవకాశానని చంద్రబాబు ఉపయోగించుకొని, పైచేయి సాధించారని అంటున్నారు. అంతేకాదు, తాజాగా ఆయనను చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ని కూడా చేశారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, నంద్యాలకు ఇచ్చిన హామీలపై చంద్రబాబు దృష్టి సారించారు.