భర్త అక్రమ సంబంధం.. భార్య ఆత్మహత్యకు దారితీసింది
కపిలేశ్వరపురం : వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకొంది. తీరు మార్చుకోని భర్త ప్రవర్తనతో విసుగు చెందిన ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో.. బొబ్బిల్లంక గ్రామానికి చెందిన దుర్గ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన దుర్గ, బొబ్బిల్లంక గ్రామానికి చెందిన బొడ్డు నరేష్ కొంతకాలం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయ్యాక కొంతకాలానికే వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న నరేష్ సంవత్సర కాలంగా ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

దీంతో దంపతులిద్దరి మధ్య తరుచూ ఈ విషయమై గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో భర్త ప్రవర్తనతో విసుగు చెందిన దుర్గ మంగళవారం నాడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, విషయం తెలుసుకుని బొబ్బిల్లంకకు చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తెది ఆత్మహత్య కాదని అల్లుడు నరేషే హత్య చేసి ఉరి వేసుంటాడని ఆరోపించారు. అయితే నరేష్ తరుపు బంధువులు మాత్రం ఆరోపణలను కొట్టిపారేశారు. దుర్గ ఆత్మహత్య చేసుకుందని వారు చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications