విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కార్మికుల ఛలో ఢిల్లీ .. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు రంగం సిద్ధం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేంద్రం ముందుకు వెళుతూనే ఉంది. ప్రైవేటీకరణ చేసి తీరుతామని స్పష్టంగా చెబుతోంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ, హైకోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్ విచారణ సమయంలోనూ కేంద్రం తమ వైఖరి స్పష్టంగా చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100% ప్రైవేటీకరణ చేస్తామని తేల్చిచెప్పింది.
కేంద్రం తీరుతో విశాఖ ఉక్కు కార్మికులు ఆందోళనను ఉదృతం చేశారు. విశాఖ ఉక్కు కార్యాచరణ సమితి జాతీయ స్థాయిలో ఆందోళన కు పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతు తెలపాలని, ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనాలని విశాఖ ఉక్కు కార్యాచరణ సమితి రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ వేదికగా నిరసనకు సిద్ధమవుతున్న విశాఖ కార్మికులు, వేలాది సంఖ్యలో విశాఖ నుండి హస్తినకు బయలుదేరాడు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ నెల 2, 3 తేదీలలో నిరసనలు తెలపడానికి సన్నాహాలు చేసుకున్నారు.

జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తేనే కేంద్రం దిగి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 2,3 వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే వేలాది సంఖ్యలో విశాఖ ఉక్కు కార్మికులు ఢిల్లీ బయలుదేరారు. ఈ రోజు కొందరు విమానాల్లో ఢిల్లీకి చేరుకుంటున్నారు.శనివారం రాత్రి నుండి ఢిల్లీ బాట పట్టిన విశాఖ ఉక్కు కార్మికులు తమ గళాన్ని ఢిల్లీ వేదికగా గట్టిగా వినిపించనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్లకు చేరుకున్న కార్మికులు కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.జనవరి నెలలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించిన నాటి నుండి కార్మికులు పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదున్నర నెలలుగా పోరాడుతున్నా కేంద్రానికి తమ గోడు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు విశాఖ ఉక్కు కార్మికులు. కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్టీల్ ప్లాంట్ కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications