వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ నీ పాపపు సొమ్ము పంచితే వచ్చే జన్మలో అయినా సీఎం అవుతావ్ ... సాధినేని యామిని ఘాటు వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని జగన్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు . జగన్ పాపపు సొమ్ము ఇప్పటికైనా పంచితే వచ్చే జన్మలో అయినా సీఎం అవుతాడని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 కారులో ఆధిపత్య పోరు .. టీఆర్ఎస్ నేతలను డామినేట్ చేస్తున్న ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు <br> కారులో ఆధిపత్య పోరు .. టీఆర్ఎస్ నేతలను డామినేట్ చేస్తున్న ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించని జగన్ కూడా సైకోనే అని యామిని ఫైర్

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించని జగన్ కూడా సైకోనే అని యామిని ఫైర్

జగన్ కూడా రాం గోపాల్ వర్మ లాంటి సైకో అని , చనిపోయిన విద్యార్థుల కోసం ట్వీట్ చెయ్యడానికి గానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి గానీ జగన్ కు నోరు రాలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అభంశుభం తెలియని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులపై స్పందించకపోవడం దారుణమన్నారు.

జగన్ ఏపీలో ఇంటికి టూలెట్ బోర్డు పెట్టుకుంటే మంచిది.. ఆయన ఎప్పటికీ టూరిస్ట్ అన్న యామిని

జగన్ ఏపీలో ఇంటికి టూలెట్ బోర్డు పెట్టుకుంటే మంచిది.. ఆయన ఎప్పటికీ టూరిస్ట్ అన్న యామిని

జగన్ ఎప్పటికీ ఏపీకి ఒక టూరిస్ట్ అని ఆమె మండిపడ్డారు. మరోవైపు హైదరాబాద్ లో ఉంటూ అమరావతిలో ఐదేళ్లపాటు ఒక్కో ఇటుకు పేర్చి నిర్మించుకున్న ఇంటికి టూ లెట్ బోర్టు పెట్టుకుంటే మంచిదని సూచించారు. ఏపీకి టూరిస్ట్ లా జగన్ మారిపోయారని విమర్శించిన యామిని ఇప్పటికీ హైదరాబాద్ లోనే జగన్ ఉన్నారని మండిపాటుకు గురయ్యారు. జగన్ ఏపీలో నిర్మించుకున్న ఇంట్లో ఒక ఐటీ కంపెనీ పెట్టుకుంటే కనీసం అద్దె అయినా వస్తుందని ఆమె పేర్కొన్నారు .

జగన్ సంపాదించిన పాపపు సొమ్ము పంచితే వచ్చే జన్మలో అయినా సీఎం అవుతావ్ ... యామిని ఘాటు వ్యాఖ్యలు

జగన్ సంపాదించిన పాపపు సొమ్ము పంచితే వచ్చే జన్మలో అయినా సీఎం అవుతావ్ ... యామిని ఘాటు వ్యాఖ్యలు


మే 23 తర్వాత వైఎస్ జగన్ శాశ్వతంగా ఏపీకి టూరిస్ట్ గా మారిపోతారని సాధినేని యామిని జోస్యం చెప్పారు. ఒకపక్క సీఎం అవుతానని ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టించుకుని హల్ చల్ చేస్తుంటే అంత సీన్ లేదని చెప్తున్నారు యామిని .ఇక మే 23 తర్వాత ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్‌ లు దుకాణం సర్డుకోవాలని సాధినేని యామిని హెచ్చరించారు. వైఎస్ జగన్ సంపాదించిన పాపపు సొమ్మును మంచి పనుల కోసం వినియోగిస్తే ఇప్పుడు కాకపోయినా వచ్చే జన్మలో అయినా సీఎం కావాలనుకునే మీ కల నిజమవుతుందని చెప్పుకొచ్చారు.

English summary
Telugu Desam Party Fire Brand Sadhineni Yamini fired on Jagan.Jagan has been criticized that after 23rd, YS Jagan will permanently a tourist to AP. She said that an IT company at home built in AP would have a minimum rental to Jagan. If YS Jagan utilise his corrupted earnings for good works , in another birth Jagan's dream to become the CM will come true Yamini said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X