జగన్! రూ.11కోట్లకు కక్కుర్తిపడి వైయస్ అలా చేశారు: మంత్రి యనమల సవాల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రులుగా రాష్ట్రానికి చంద్రబాబు, వైయస్లు ఎవరెవరు ఏమేం తెచ్చారో చర్చిద్దామా? అంటూ సవాల్ విసిరారు.
రాష్ట్రానికి పెట్టుబడులను తెచ్చేందుకు చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తుంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్రిక విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వైయస్సార్ అయితే విదేశీ పర్యటనలకు వెళ్లి స్కాంలు చేసి వచ్చారని ఎద్దేవా చేశారు.

వైయస్ జర్మనీకి వెళ్లారని.. మరి ఫోక్స్ వ్యాగన్ సంస్థ ఏమైందని ప్రశ్నించారు. రూ.11 కోట్లకు కక్కుర్తి పడి.. ఈ సంస్థ మహారాష్ట్రకు తరలిపోయేలా చేశారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేశారని అన్నారు. ఆయన పర్యటనల వల్లే రాష్ట్రానికి కియా, హీరో, ఇసుజు వంటి దిగ్గజ కంపెనీలు వచ్చాయని తెలిపారు. అంతేగాక, త్వరలోనే బెల్, డెల్, యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా రాబోతున్నాయని వివరించారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications