జగన్! రూ.11కోట్లకు కక్కుర్తిపడి వైయస్ అలా చేశారు: మంత్రి యనమల సవాల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రులుగా రాష్ట్రానికి చంద్రబాబు, వైయస్లు ఎవరెవరు ఏమేం తెచ్చారో చర్చిద్దామా? అంటూ సవాల్ విసిరారు.
రాష్ట్రానికి పెట్టుబడులను తెచ్చేందుకు చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తుంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్రిక విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వైయస్సార్ అయితే విదేశీ పర్యటనలకు వెళ్లి స్కాంలు చేసి వచ్చారని ఎద్దేవా చేశారు.

వైయస్ జర్మనీకి వెళ్లారని.. మరి ఫోక్స్ వ్యాగన్ సంస్థ ఏమైందని ప్రశ్నించారు. రూ.11 కోట్లకు కక్కుర్తి పడి.. ఈ సంస్థ మహారాష్ట్రకు తరలిపోయేలా చేశారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేశారని అన్నారు. ఆయన పర్యటనల వల్లే రాష్ట్రానికి కియా, హీరో, ఇసుజు వంటి దిగ్గజ కంపెనీలు వచ్చాయని తెలిపారు. అంతేగాక, త్వరలోనే బెల్, డెల్, యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా రాబోతున్నాయని వివరించారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications