జగన్ నిర్ణయాలు అదుర్స్ అంటూ వైసీపీ ఎమ్మెల్యేల కితాబు .. సంచలన నిర్ణయాలతో జగన్ దూకుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మార్కు పాలన సాగించనున్నారు. ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలను తీసుకుంటూ పాలనలో దూకుడు చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న సీబీఐ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ ఇప్పుడు తాజాగా ఏపీకి ఐదుగురు ఉపముఖ్యమంత్రులను నియమిస్తున్నట్టు ప్రకటించడం నిజంగా సంచలనమే అని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక పాలన సజావుగా సాగేందుకు పూర్తి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన జగన్ మంత్రివర్గ ఏర్పాటు పనిలో పడ్డారు.
జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ముఖ్యనాయకులు జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, జగన్ నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణయుగంలా మారబోతోందని బొత్సా పేర్కొన్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంను ఇంతవరకు చూడలేదని ఆయన జగన్ పనితీరుపై ప్రసంశల వర్షం కురిపించారు . మాటలు చెప్పడం కాదు, ఏదైనా చేతల్లో చూపుతున్న సీఎం జగన్ అని, పదవుల్లో సామాజిక న్యాయం చేసిన ఘనత ఆయనదేనని ప్రశంసించారు బొత్సా సత్యన్నారాయణ .

ఇక ఇంకో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏపీ సీఎం జగన్ కు కితాబిచ్చారు. జగన్ నిర్ణయం రాజకీయాల్లో సంచలనం సృష్టించిందని ఆయన అభిప్రాయపడ్డారు . అందరికీ సమన్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ఆయన అందరికీ సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు . రాబోయే రోజుల్లో ప్రజలు అద్భుతమైన పాలన చూస్తారని పేర్కొన్నారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. వైసీపీకి చెందిన మరో నేత నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యరని, నిలబెట్టుకుంటారని పేర్కొన్నారు. రాజన్న రాజ్యం దిశగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని ఆమె అన్నారు . అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించారని నగరి ఎమ్మెల్యే రోజా జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications