వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ అరెస్ట్...కిడ్నాప్ అనుకొని పోలీసులను అడ్డుకున్న స్థానికులు
చిత్తూరు:తెలుగుదేశం పార్టీ గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టింగులు పెట్టాడనే ఆరోపణలతో పుంగనూరుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ నవీన్కుమార్ రాజును ఆదివారం సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
అయితే హఠాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఇన్నోవా వాహనంలో వచ్చి నవీన్కుమార్రాజును ఎక్కించుకొని వెళుతుండటంతో కలకలం రేగింది. తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారని భావించిన నవీన్ కుమార్ రాజు తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులకు విషయం తెలిపారు. ఆ క్రమంలో స్థానికులు ఒకరికొకరు సమాచారం ఇచ్చుకొని నవీన్ ను తీసుకువెళుతున్న ఇన్నోవాని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే...
చిత్తూరు జిల్లా పుంగనూరు కొత్తయిండ్లుకు చెందిన నవీన్కుమార్రాజు అనే యువకుడు కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని తెలిసింది. ఆ క్రమంలో ఇతడు ఇటీవల సిఎం చంద్రబాబు, టిడిపి ని కించపరుస్తూ పలు పోస్టింగ్ లు పెట్టినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నవీన్ కుమార్ రాజుపై గుంటూరు సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అతడిని అరెస్టు చేసేందుకు పుంగనూరుకు చేరుకున్నారు.
ఇన్నోవా వాహనంలో వచ్చిన పోలీసులు నవీన్ ఎక్కడనున్నాడో తెలుసుకొని అతడిని అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించేందుకు వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు.
అయితే గుర్తు తెలియని వ్యక్తులు నవీన్ కుమార్ రాజును ఇన్నోవా వాహనంలో ఎక్కించుకొని తీసుకువెళుతున్న విషయం తెలిసి స్థానికులు ఆ వాహనం నంబర్ నోట్ చేసుకొని అతడి తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకనాథరెడ్డికి విషయం తెలిపి వాహనం నంబర్ ఇచ్చారు. ఆ క్రమంలో స్థానిక వైసిపి నేతలు వాహనం నంబర్ ఆధారంగా వాల్మీకిపురం మండలం చింతపర్తి వద్ద ఇన్నోవాను అడ్డుకున్నారు. అయితే తాము గుంటూరు పోలీసులమని నవీన్కుమార్రాజుపై సైబర్క్రైం కేసు నమోదు కావడంతో అరెస్టు చేసిzతీసుకెళుతున్నామని పోలీసులు తెలపడంతో వాహనానికి దారి ఇచ్చారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications