విషాదం :కాబోయే భార్యను చూసేందుకు వెళ్తూ అనంతలోకాలకు
కాబోయే భార్యను మాట్లాడేందుకు మోటార్ బైక్ పై వెళ్తూ ఓ యువకుడు మరణించాడు . ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకొంది.
చిత్తూరు:కాబోయే భార్యను చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకొంది.
చిత్తూరు జిల్లా మదనపల్లె ఆనపగుట్టల్లో నివాసం ఉంటున్న యువతిని వైఎస్ఆర్ కడప జిల్లా యువకుడు శివకుమార్ వివాహం చేసుకోవాలని భావించాడు.
రాయచోటి సమీపంలోని సుండుపల్లె మండలం పొలిమేరపల్లె పంచాయితీ పెద్దపల్లెకు చెందిన గురిగింజకుంట సుబ్బనాయుడి కుమారుడు శివకుమార్ నాయుడు రోడ్డుప్రమాదంలో మరణించాడు.

శివకుమార్ నాయుడికి మదనపల్లెలోని దూరపు బంధువు శిరీషతో వివాహం నిశ్చయమైంది.అయితే తన కాబోయే భార్య శిరీషతో మాట్లాడి వస్తానని బైకుపై బయలుదేరిన శివకుమార్ నాయుడును గుర్రంకొండ సమీపంలో లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శివకుమార్ నాయుడు స్పృహతప్పిపోయాడు.స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుత్రికి చికిత్స పొందుతూ ఆయన ఆదివారం నాడు మరణించాడు.












Click it and Unblock the Notifications