కోర్టుకు జగన్: పెన్నా సిమెంట్స్కు కోర్టులో ఎదురు దెబ్బ
హైదరాబాద్: కేసుల విచారణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుల్లో నిందితులైన విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, శ్యాంబాబ్, బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు.

జగన్ అక్రమాస్తులో కేసులో పెన్నా సిమెంట్స్ కంపెనీకి శుక్రవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఆ సంస్థ దాఖలు చేసిన అప్పీలును డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఈడీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసిన డివిజన్ బెంచ్ అభ్యంతరాలుంటే అప్పీలేట్ అథార్టీ ముందు వినిపించుకోవచ్చని సూచించింది.
జగన్ అక్రమాస్తుల కేసులో మనీల్యాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న పెన్నా సిమెంట్స్కు చెందిన అనంతపురం జిల్లా, యాడికి మండలంలోని రూ.1.15 కోట్ల విలువైన 231 ఎకరాల భూమిని, హైదరాబాద్లోని పయనీర్ హాలిడే రిజార్ట్స్కు చెందిన 6.69 కోట్ల విలువైన 907 చదరపు మీటర్ల స్థలాన్ని ఈడీ ఈ ఏడాది ఆగస్టు 12న అటాచ చేసింది. దీనిపై పెన్నా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications