చంద్రబాబు రాకపోవడం దారుణం: రైతులతో వైయస్ జగన్
కాకినాడ: భారీ వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన రైతుల వద్దకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాకపోవడం దారుణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారంనాడు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం చినగొళ్లపాలెం చేరుకున్నారు.
ఆ గ్రామంలో ఆయన వరద బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత వర్షాలతో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు. జిల్లాలో లక్షన్నర ఎకరాలకు పైగా పంట నష్టపోతే కేవలం 18 ఎకరాల పంట మాత్రమే నష్టపోయినట్లు అధికారులు చూపుతున్నారని జగన్ ఈ సందర్భంగా విమర్శించారు.

నష్టపోయిన చాలా మంది రైతుల వద్దకు అధికారులు వెళ్లడం లేదని ఆయన అన్నారు. గత తుఫానులో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని అన్నారు. అకాల వర్షాలతో ఎంత పంట నష్టం జరిగిందో తెలిసినప్పుడు రైతులకు ఒకే రకమైన పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని, అయితే అలా జరగడం లేదని అన్నారు. ఒకే రకంగా పరిహారం ఇవ్వకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన తప్పు పట్టారు.
తన వద్ద ఆవేదన వ్యక్తం చేసిన రైతులకు జగన్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్ని విధాల రైతులకు అండగా ఉంటామని ఆయన చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications