వైసీపీకి తీరిన ఆ ఎంపీ సీటు బెంగ ! అభ్యర్ధిగా మాజీ మంత్రి-త్వరలో జనంలోకి..
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు పలు చోట్ల కలకలం రేపింది. ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఓ ఎంపీ స్ధానం నుంచి మరో చోటికి వెళ్లాలని కోరడంతో సదరు సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్టీకే రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో ఈ సీటులో ఎవరిని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్న సీఎం జగన్ కు తాజాగా తట్టిన ఓ ఆలోచన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితేనేం వైసీపీకి మాత్రం ఆ ఎంపీ సీటులో అభ్యర్ధి బెంగ మాత్రం తీరినట్లే కనిపిస్తోంది.
రాష్ట్రంలోని ఎంపీ సీట్లలో పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చే కీలకమైన నరసరావుపేట స్ధానం కూడా ఒకటి. ఇక్కడి రాజకీయ, కుల సమీకరణాల నేపథ్యంలో అభ్యర్ధిని ఎంచుకోవడం పార్టీలకు అంత సులువు కాదు. అయితే ఓ ప్రయోగం చేద్దామని గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావు కృష్ణదేవరాయల్ని జగన్ నరసరావుపేట ఎంపీ సీటులో బరిలోకి దింపి గెలిపించుకున్నారు. అయితే అప్పట్లో వైసీపీ హవాలో గెలిచిన లావు.. మరోసారి అక్కడ గెలవలేరనే నిర్ణయానికి జగన్ వచ్చేశారు. దీంతో బీసీ అభ్యర్ధి వైపు ఆయన దృష్టి మళ్లింది.

నరసరావుపేట స్ధానంలో వైసీపీ తరఫున కొత్తగా బీసీ అభ్యర్ధిని తీసుకొస్తే కుదురుకోవడానికి సమయం పడుతుంది. దీంతో పార్టీలో ఉన్న మంత్రి విడదల రజనీతో పాటు మరికొన్ని ఆప్షన్లను జగన్ పరిశీలించారు. చివరికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిన్న అనిల్ యాదవ్ సీఎం జగన్ ను వచ్చి కలిశారు. ఈ సందర్భంగా అనిల్ కు ఈసారి నరసరావుపేట సీటులో పోటీ చేయాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన కూడా సరేనన్నారు.
అనిల్ యాదవ్ ను నరసరావుపేట నుంచి బరిలోకి దింపడం ద్వారా అక్కడ భారీ సంఖ్యలో ఉన్న బీసీ ఓటు బ్యాంకును క్యాష్ చేసుకోవాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. యువకుడు, ఉత్సాహవంతుడు, అన్నింటికంటే మించి విధేయుడైన అనిల్ యాదవ్ ను నరసరావుపేట నుంచి గెలిపించుకుంటే ఈ సీటు పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో బీసీ అభ్యర్ధి లేడనే సమస్య కూడా తీరిపోతుంది. దీంతో త్వరలో అనిల్ ను అక్కడి ఎమ్మెల్యేలకు పరిచయం చేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications