మన టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లకు గుర్తింపు-స్కూళ్లలో మరింతగా ఏఐ- జగన్ కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరుపై సీఎం జగన్ ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ విద్యలో ఐబీ సిలబస్పై చర్చించారు. ప్రపంచస్థాయిలో విద్యాబోధనే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు. ముందుగా విస్తృతంగా అధ్యయనం, కసరత్తు చేయాలన్నారు. విద్యార్థుల ప్రయోజనాలు నెరవేర్చేలా, విద్యావ్యవస్థ అవసరాలను, విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ అధ్యయనం చేయాలన్నారు.
ఉపాధ్యాయుల సమర్థతను పెంచడం, సజావుగా బోధనచేసేలా ఏంచేయాలన్న దానిపై చర్చించాలన్నారు.
ఏపీ స్కూళ్లలో ఏఐలో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్ అకడమిక్ కమ్యూనిటీలో ప్రసిద్ధ సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. పైలట్ పద్ధతిలో వివిధ సంస్థల కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఏఐలో క్రియేటర్లుగా మారడం ఎలా అన్నది మరొక ప్రధాన అంశమన్నారు. అందుబాటులో ఉన్న ఏఐని వాడుకుని దాన్ని బోధనలో, సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో వినియోగించుకోవాలన్నారు.

ఉన్న సబ్జెక్టులను మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి కూడా ఏఐని వినియోగించుకోవాలని సీఎం జగన్ సూచించారు. కొత్త తరహా సబ్జెక్టులను నేర్చుకునేందుకూ ఏఐని వినియోగించుకోవాలన్నారు. అధ్యాపకుల కొరత, కంటెంట్ల కొరతను నివారించడానికి ఏఐ వినియోగపడుతుందన్న సీఎం.. దీనిపై ప్రధానంగా దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పాఠశాల విద్యలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలన్నారు.
ఏపీలో ఒక విద్యార్థి పదోతరగతి సర్టిఫికెట్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా.. విలువైనదిగా ఉండాలన్నదే లక్ష్యమని జగన్ తెలిపారు. శాస్త్రసాంకేతిక, ఆర్థిక, వ్యాపారం, ఇతర రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా ఉండాలన్నారు. గతంలో నాకన్నా ముందు ఒక ప్రభుత్వం ఉండేది కాని, ప్రభుత్వ స్కూళ్లను, విద్యార్థులను గాలికొదిలేసిందన్నారు. మనం వచ్చాక అనేక మార్పులు తీసుకొచ్చి, ప్రపంచంలో అన్ని అవకాశాలు పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు.

సాధారణ ఆలోచనలతో కాకుండా మెరుగైన ఆలోచనలతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే ప్రక్రియ కొనసాగాలని సీఎం జగన్ సూచించారు. నాయకులుగా ఉండే వ్యక్తులు మార్పులను స్వాగతిస్తూ, పేద విద్యార్థులకు మంచి జీవితాన్ని అందించాలన్నారు. సులభంగా నేర్చుకునే విధానాన్ని, విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేలా, వారిలో సృజనాత్మకత పెంచేందుకు నిరంతరం కృషిచేస్తున్నామన్నారు. అలాగే విద్యావిధానం జాబ్ఓరియెంటెడ్గా ఉండాలన్నారు. విద్యార్ధులు తాము నేర్చుకున్న థియరీ జీవితంలో ఏ మేరకు ప్రాక్టికల్గా ఉపయోగపడుతుందో ప్రశ్నించేదిగా ప్రశ్నాపత్రాలు ఉండాలని ఆదేశించారు.
విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులకూ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్గించాలన్నారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications