Jaganannaku Chebudam : 'జగనన్నకు చెబుదాం' ప్రారంభం-స్పందనకూ, దీనికీ తేడా చెప్పిన జగన్..
ఏపీలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం వైసీపీ ప్రభుత్వం ఇవాళ మరో కొత్త వ్యవస్ధను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న స్పందనతో పాటు జగనన్నకు చెబుదాం పేరుతో మరో కొత్త వ్యవస్ధను అమల్లోకి తెచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ జగన్ దీన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు మరింత మెరుగ్గా పరిష్కారం చూపించేందుకు వీలుగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

తన పాదయాత్రలో ప్రతీ జిల్లాలో, ప్రతీ గ్రామంలో కనిపించిన సమస్యలకు పరిష్కారం చూసే దిశగా పాలన సాగించినట్లు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో 90 నుంచి 95 శాతం సమస్యలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, ప్రభుత్వం న్యాయంగా ఉంటే ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉంటుందని భావించినట్లు జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో అర్హత ఉండి కూడా పథకాలకు పొందాలంటే జన్మభూమి కమిటీలు ఏ పార్టీ అని అడిగి వాటిని ఇచ్చేవారన్నారు. పెన్షన్ల నుంచి ఇళ్ల కేటాయింపుల వరకూ ఇదే పరిస్ధితి ఉండేదన్నారు.
ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. వివక్షకు తావులేని వ్యవస్ధ తీసుకురావాలని విప్లవాత్మక అడుగులు వేశామన్నారు. అందులో భాగంగానే స్పందన కార్యక్రమం అమలు చేశామన్నారు. స్పందన కంటే మెరుగ్గా ఉండేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. పథకాలకు అర్హత ఉన్నా రాకపోతే, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైనా, వ్యక్తిగత సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపేందుకే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ల నుంచి కమిషనర్ల వరకూ, సచివాలయాల వరకూ అందరినీ భాగస్వాముల్ని చేస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం చేపడుతున్నట్లు జగన్ తెలిపారు. ఎక్కడైనా, ఏ సమస్య కైనా ప్రయత్నం చేసినా పని జరగని పరిస్దితి ఉంటే వాటికి పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ఇదో మంచి వేదిక అవుతుందన్నారు. ఎక్కడా పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు నేరుగా 1902కు ఫోన్ చేయాలని సూచించారు. మీరు చేసే ఫిర్యాదులు నేరుగా తన కార్యాలయానికే వస్తాయన్నారు.
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
ఏపీలో ఆ ప్రాంతానికి పులి, స్థానికుల భయం.. రంగంలోకి హనుమాన్ బృందాలు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications