గోదావరి వరద-బాధితులకు జగన్ సర్కారీ సంస్ధ రూ.5 కోట్ల విరాళం-సీఎం టూర్ కు ముందే..
గోదావరి నదికి ఈ ఏడాది వచ్చిన తీవ్ర వరదల కారణంగా పలు జిల్లాల్లో జనం అష్ట కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల పరిస్ధితి తీసికట్టుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి రెండు వేల రూపాయల చొప్పన సాయంతో పాటు కూరగాయలు, ఇతర సాయం అందిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ సంస్ధ ఏపీఎండీసీ కూడా వారికిసాయం చేసేందుకు ముందుకొచ్చింది.
గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఇవాళ రూ.5కోట్ల విరాళం అందించింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్ను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్కు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి అందజేశారు.

గోదావరి వరద సహాయక ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ పర్యటించబోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు గోదావరి వరద ప్రభావిత జిల్లాల్లో జగన్ పర్యటన కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. అంతకుముందే ప్రభుత్వ సాయంత పాటు ఏపీఎండీసీ కూడా వరద బాధితుల కోసం రూ.5 కోట్లు అందించింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేసేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే ఏపీఎండీసీ ఈ సాయం ప్రకటించడం, చెక్ కూడా అందించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications