వల్లభనేని వంశీ ప్రచార వాహనంపై జగన్ పార్టీ దాడి

YSRCP activists attack Vamshi's vehicle
విజయవాడ: తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసనసభా నియోజకవర్గం అభ్యర్థి వల్లభనేని వంశీ ప్రచార వాహనంపై మంగళవారంనాడు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు.

గన్నవరంలో వైయస్ జగన్ రోడ్‌షోకు వెళ్లి తిరిగి వస్తూ తమకు కనిపించిన వంశీ ప్రచార వాహనంపై దాడి చేశారు. వంశీ ఎదుటే కర్రలతో, రాళ్లతో వారు దాడికి పూనుకున్నారు. విజయవాడ బాపులపాడు మండలం కొత్తమల్లిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనపై వంశీ డిఐజికి, కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్ట అధినేత చంద్రబాబునాయుడు బస చేసిన హోటల్ వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. చంద్రబాబు కలిసేందుకు వచ్చిన నాయకులను పోలీసులు లోనికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లాలోని ద్వారకా జోన్ పరిధిలోని ఓ లాడ్జిలో సోమవారం సాయంత్రం అధికారులు తనిఖీలు నిర్వహించారు. లాడ్జిలో లభించిన ల్యాప్‌టాప్‌లలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఓటర్ల వివరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డబ్బులు పంచేందుకు ఓటర్ల వివరాలు సేకరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసి కలెక్టర్‌కు నివేదిక అందజేసిన అధికారులు ఈవ్యవహారంపై విచారణ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+