చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసి బస్సు ఢీకొని జగన్‌పార్టీ నేత మృతి, నదిలో ఇద్దరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 YSRCP leader dies in road accident
చిత్తూరు/హైదరాబాద్: ఆర్టీసి బస్సు ఢీకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఒకరు మృతి చెందారు. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ పార్టీకి చెందిన ప్రభాకర్ అనే నాయకుడు మృత్యువాత పడ్డారు. ఆయనతో పాటు స్కూటర్ పైన వస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

కెకె పేట నుండి పులిచర్ల మీదుగా పీలేరుకు వెళ్తున్న ఆర్టీసి బస్సు వడ్లపల్లె మెయిన్ రోడ్డు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వీరి స్కూటర్‌ను ఢీకొంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

నదిలో పడి విద్యార్థుల మృతి

విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేట గ్రామంలో పిక్నిక్ కోసం వెళ్లిన ఉన్నత పాఠశాల విద్యార్థినులు నదిలో పడి మృతిచెందారు. గురువారం గ్రామంలోని హైస్కూల్ విద్యార్థులు పిక్నిక్ చేసుకునేందుకు చంపావతి నది ఒడ్డున గల తోటకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనానంతరం బంతి ఆట ఆడుతుండగా, బంతి నదిలో పడిపోయింది. దీనిని తెచ్చేందుకు నదిలో ముగ్గురు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు.

కాల్వలో పడి ముగ్గురు

రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం మహమ్మదాబాద్ వద్ద కాల్వలో పడి ఒకే కుటుంబంలోని తల్లీ, కుమారుడు, కుమార్తె మృతి చెందారు. వారిని మల్లమ్మ, నవీన్, పౌర్ణమిలుగా గుర్తించారు.

గుంటూర్లో..

గుంటూరు జిల్లాలో స్నానం కోసం వెళ్లి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరిని ఓ కానిస్టేబుల్ రక్షించారు.

English summary
One YSR Congress Party leader died in a road accident that took place in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X