అమెరికాలో రోడ్డు ప్రమాదం-వైసీపీ ఎమ్మెల్యే బంధువుల దుర్మరణం..
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు ఏపీ వాసుల్ని బలి తీసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన ఐదుగురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
వీరంతా వైసీపీ మమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ బంధువులే. దీంతో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ కుటుంబంలో విషాదం నెలకొంది. టెక్సాస్ హైవేలో జరిగిన ఈ కారు ప్రమాదానికి అసలు కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.

టెక్సాస్ హైవేలో రెండు కార్డు ఢీకొన్న ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చిన్నాన్న కుటుంబం దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎమ్మెల్యే సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామాలక్ష్మి, కూతురు నవీన గంగ, మనవడు, మనవరాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే ప్రమాదంలో నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ కు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications