చంద్రబాబును ఆడేసుకుంటున్న సాయిరెడ్డి- బాయ్కాట్పై- జెండా పీకేసే ముందు..
ఏపీలో పాత నోటిఫికేషన్ ప్రకారమే నిర్వహిస్తున్నారన్న కారణంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలన్న విపక్ష టీడీపీ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీ వంటి పార్టీ ఇలా తొలిసారి ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రంలో చర్చ సాగుతోంది. అదే సమయంలో ఇదే అదనుగా వైసీపీ నేతలు టీడీపీ నిర్ణయంపై విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్ను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్లు పెట్టారు.
పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని వెక్కిరించేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో టీడీపీ ఇక జెండా పీకేయడమే మిగిలుందనేలా సాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జెండా పీకేసే ముందు పరిణామాలు అంటూ సాయిరెడ్డి ఇందులో నాలుగు అంశాలను పేర్కొన్నారు. ఇందులో వరుస ఓటములతో నాయకత్వంపై కేడర్కు నమ్మకం పోతుంది, శ్రేణులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటాయి, పోటీకి అభ్యర్ధులు దొరకరు, ఏవో సాకులు చూపుతూ ఎలక్షన్లకు దూరంగా ఉంటామని నాయకత్వం ప్రకటిస్తుంది, ఖేల్ ఖతం దుకాణం బంద్ అంటూ సాయిరెడ్డి ట్వీట్లో రెచ్చిపోయారు.

మరో ట్వీట్లో చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారా లేదా ప్రజలే చంద్రబాబును బహిష్కరించారా అంటూ మరో ట్వీట్లో సాయిరెడ్డి ప్రశ్నించారు. లోకల్ బాడీలు చంద్రబాబును భయపెడుతున్నాయా.. లేక లోకేష్ బాడీ లాంగ్వేజ్ చంద్రబాబు భయపెడుతోందా ? అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే వైసీపీ నేతలంతా టీడీపీ పరిషత్ ఎన్నికల బహిష్కరణపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్వీట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications