జగన్కు డ్యూటీ గుర్తు చేసిన రఘురామకృష్ణంరాజు- ఆ మీటింగ్ పెట్టాలని లేఖ
వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనా నిత్యం విమర్శలు చేస్తున్న రెబెల్ నేత రఘురామకృష్ణంరాజు ఇవాళ పార్టీ అధినేత, సీఎం జగన్కు ఓ లేఖ రాశారు. ఎప్పటిలా కాకుండా ఆయన ఈసారి వినమ్రంగా అధినేత జగన్కు తన బాధ్యతను గుర్తు చేశారు. విమర్శల జోలికి పోకుండా రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ సమావేశం నిర్వహించాలని ఆయన తన లేఖలో జగన్ను కోరారు.
సాధారణంగా పార్లమెంటు సమావేశాలకు ముందు వివిధ పార్టీల అధినేతలు ఆయా పార్టీలకు చెందిన ఎంపీలతో భేటీ నిర్వహిస్తుంటారు. ఇందులో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తారు. రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన సమస్యలపై ఎంపీలకు పార్టీ అధినేతలు బ్రీఫ్ చేస్తుంటారు. కానీ ఈసారి పార్లమెంటు సమావేశాలకు ఐదురోజులే మిగిలున్నా ఇప్పటివరకూ జగన్ ఎంపీల సమావేశం నిర్వహించకపోవడాన్ని రఘురామ గుర్తుచేశారు. అనవాయితీ ప్రకారం ఎంపీల భేటీ నిర్వహించాలని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించాలని జగన్ను ఆయన కోరారు.

ఈసారి విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను కూడా ఆహ్వానించాలని, ఈ సమావేశాన్ని వర్చువల్ భేటీగా నిర్వహించాలని రఘురామ తన లేఖలో జగన్ను కోరారు. రాష్ట్రానికి చెందిన చాలా సమస్యలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ఎంపీలు పనిచేసేలా జగన్ దిశానిర్దేశం చేయాలని రఘురామ కోరారు.
-
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications