ఫిరాయింపులకు కౌంటర్: సాక్షి మీడియానే జగన్ అస్త్రం
విజయవాడ: సాక్షి మీడియాను అస్త్రంగా ప్రయోగిస్తూ తమ పార్టీ శాసనసభ్యుల ఫిరాయింపులకు బ్రేక్ వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహం పన్నినట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పార్టీ మారిన శాసనసభ్యుల బాగోతాల గుట్టు విప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ వ్యూహంలో మొదటి విడతగా అమరావతి భూబాగోతాలను, చంద్రబాబు బినామీలను వేలెత్తి చూపుతూ బుధవారం సాక్షి దినపత్రికలో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఇటువంటి కథనాలనే వరుసగా ఇస్తూ పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్యేలకి గుబులు పుట్టించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, తమ పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

టీడీపీలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఫిరాయింపుదారులేనని అన్నారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రభావం ఉండదని, ప్రభుత్వంపై తమ పోరాటం తీవ్రత తగ్గదని స్పష్టం చేశారు.
నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు. శాసనసభలో ఫిరాయింపుదారులపై తేల్చుకుంటామని అన్నారు.
చంద్రబాబునాయుడు తను సంపాదించిన అవినీతితోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొంటున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. తెలంగాణలో చంద్రబాబు పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడని అన్నారు. తెలంగాణలో జరిగిన అవమానాన్ని మర్చిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పని చేస్తున్నారని మండిపడ్డారు.
ఫిరాయింపుల చట్ట ప్రకారం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే విశ్వనీయత గురించి చంద్రబాబు మాట్లాడుతుండటం హాస్యాస్పదమని అన్నారు.
టీడీపీ ప్రభుత్వం అవినీతి బాగోతాలను బయటపెడతామని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబునాయుడు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం












Click it and Unblock the Notifications