స్టాలిన్ తో స్నేహం కోసం ఇక్కడ సర్వనాశనం చేస్తున్నారు, ఏమిటి సార్ ఈ లాజిక్ లు!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు చెందిన పలుకుబడి ఉన్న నేతలంతా ఏకమై కావేరీ నీటికి సంబందించిన మేకేదాటు ప్రాజెక్టు కోసం పాదయాత్రలు చేశారు. అయితే ఇప్పుడు తమిళనాడుకు ఎందుకు నీటిని విడుదల చేశారని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సీటీ రవి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మంగళవారం మండ్యలో బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేకేదాటు ప్రాజెక్టు కోసం డీకే శివకుమార్తో పాటు కాంగ్రెస్ నాయకులు కలిసి పాదయాత్రలు చేశారన్నారు. కానీ డీకే శివకుమార్ తమిళనాడుకు ముందుగానే నీటిని విడుదల చేసి కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశాని సీటీ రవి ఆరోపించారు.

కావేరీ కర్ణాటక గర్వించ దగ్గ విషయం మాత్రమే కాదు, మన జీవ స్వాస, మండ్య, మైసూర్లోని రైతుల జీవితాలను మెరుగుపరిచింది కావేవరి నీరు, బెంగళూరు ప్రజల దాహం తీర్చుతున్నదని ఇదే కావేరి నీరు అని సీటీ రవి అన్నారు. కావేరీ లేకుండా బెంగళూరు మనుగడ సాగించదు. కావేరి వివాదం ఈరోజు నిన్నటిది కాదు. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో కావేరీ నదీ జలాలను కాపాడాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉందని సీటీ రవి అన్నారు.
రైతులంతా ఒక్కటే, కర్ణాటక, తమిళనాడు అనే తేడా లేదు. కానీ సమస్య ఉన్నప్పుడు, నీటి పంపిణి ఫార్ములా ప్రకారం వ్యవహరించాలి. ఇప్పుడు కర్ణాటకలో వర్షాలు లేవని, తమిళనాడు ప్రజలు అర్థం చేసుకోవాలని సీటీ రవి అన్నారు. పిల్లలు ఏడ్చినప్పుడే తల్లి పాలు ఇస్తుంది. అయితే అందుకు విరుద్దంగా తమిళనాడు అడగకముందే కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు నీళ్లు వదిలేశారని సీటీ రవి ఆరోపించారు.

స్టాలిన్ దోస్తీకి కర్ణాటకను సిద్దరామయ్య ప్రభుత్వం బలిపశువును చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. మండ్య ప్రజలకు శాపం ఇప్పుడు తమిళనాడుకు వరంగా మారిందని, మీ ప్రయోజనాల కోసం మీరు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని, అందుకే తమిళనాడుకు కావేరీ నీరు వదిలేస్తున్నారని మాజీ మంత్రి సీటీ రవి ఆరోపించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications