EX lover: కాలేజ్ లవర్ తో ?, నగ్న ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్, 12 లక్షల బంగారం, ఆంటీ మంగళసూత్రం!
బెంగళూరు: కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ప్రతిరోజు ఇద్దరూ కాలేజ్ లో, సాయంత్రం పూట బయట కలుసుకోవడం మొదలుపెట్టారు. రానురాను యువతిని ప్రేమిస్తున్నానని అతను వెంటపడ్డాడు. అమ్మాయి ఇంటిలోని అన్ని రూమ్ ల్లోకి అతను నేరుగా అతను వెళ్లే అంత వరకు ఇద్దరికి చనువు ఏర్పడింది. రానురాను ప్రేమికుల మద్య తేడాలు రావడంతో యువతిని అతన్ని దూరం పెట్టింది.
ఈ విషయంలో రగిలిపోయిన ప్రియుడు కొంతకాలం తరువాత నీ నగ్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇప్పటికే లక్షల రూపాయల విలువైన బంగారు నగలతో పాటు సుమారు లక్ష రూపాయల డబ్బులు ఇచ్చింది.
అమ్మాయి భయాన్ని ఇంకా క్యాష్ చేసుకోవాలని స్కెచ్ వేసిన మాజీ ప్రియుడు ఆమెను రహస్య ప్రాంతానికి పిలిపించుకుని అక్కడ లైంగిక దాడి చేశారు. తరువాత అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు. అమ్మాయి ఆమె మేనత్త మంగళసూత్రం చోరీ చేసి నిందితుడికి ఇచ్చింది. తరువాత కూడా కేటుగాడు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో సహనం కోల్పోయిన అమ్మాయి చేసిన పనికి మాజీ ప్రియుడి మైండ్ బ్లాక్ అయ్యింది.
కాలేజ్ ఫ్రెండ్స్
ఐటీ హబ్ బెంగళూరులోని కేఆర్ పురంలోని దేవసంద్రలో బ్రిజ్ భూషణ్ యాదవ్ అలియాస్ భూషణ్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కేఆర్ పురంలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్న భూషణ్ యాదవ్ కు మూడు సంవత్సరాల క్రితం అదే కాలేజ్ లో చదువుతున్న రమ్యశ్రీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతి పరిచయం అయ్యింది.
అమ్మాయి ఇంట్లోకి నేరుగా వెళ్లేవాడు
బెంగళూరులోనే నివాసం ఉంటున్న రమ్యశ్రీతో భూషణ్ యాదవ్ మద్య ఇంకా ఎక్కువ పరిచయం అయ్యింది. ప్రతిరోజు కాలేజ్ లో, సాయంత్రం పూట బయట రమ్యశ్రీ, భూషణ్ యాదవ్ కలుసుకోవడం మొదలుపెట్టారు. రానురాను రమ్యశ్రీని ప్రేమిస్తున్నానని భూషణ్ యాదవ్ వెంటపడ్డాడు. రమ్యశ్రీ ఇంటిలోని అన్ని రూమ్ ల్లోకి భూషణ్ యాదవ్ నేరుగా వెళ్లే అంత వరకు ఇద్దరికి చనువు ఏర్పడింది.
అనుమానం వచ్చి దూరం పెట్టింది
రమ్యశ్రీ ఇంటికి వెళ్లి వస్తున్న భూషణ్ యాదవ్ ఆమెతో బయట కూడా ఏకాంతంగా గడిపాడని తెలిసింది. రానురాను భూషణ్ యాదవ్ చేష్టల మీద రమ్యశ్రీకి అనుమానం వచ్చింది. భూషణ్ యాదవ్ అమ్మాయిని చాటుగా ఆమె అభ్యంతరకరంగా ఉన్న సమయంలో ఫోటోలు తియ్యడం మొదలు పెట్టాడని తెలిసింది. భూషణ్ యాదవ్ తనను ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడని అనుమానం రావడంతో అతన్ని రమ్యశ్రీ దూరం పెట్టింది.
బ్లాక్ మెయిల్ చేసిన మాజీ ప్రియుడు
రానురాను ప్రేమికులు రమ్యశ్రీ, భూషణ్ యాదవ్ మద్య తేడాలు రావడంతో ఆ యువతిని అతన్ని దూరం పెట్టింది. ఈ విషయంలో రగిలిపోయిన మాజీ ప్రియుడు భూషణ్ యాదవ్ మూడు సంవత్సరాల క్రితం నీ నగ్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని రమ్యశ్రీని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు
218 గ్రాముల బంగారు నగలు, రూ. 75 వేల క్యాష్ గోవింద
భూషణ్ యాదవ్ అన్నంతపని చేస్తాడని భయపడిన రమ్యశ్రీ ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలు ఒక్కొక్కటి చోరీ చేసి మాజీ ప్రియుడికి ఇస్తూ వచ్చింది. ఇప్పటి వరకు రమ్యశ్రీ ఆమె ఇంట్లో ఉన్న 218 గ్రాముల బంగారు నగలు, రూ. 75 క్యాష్ చోరీ చేసి భూషణ్ యాదవ్ కు ఇచ్చింది. మాజీ ప్రియురాలు రమ్యశ్రీ తన దెబ్బకు భయపడిపోయిందని, ఆమె నుంచి ఇంకా బంగారు నగలు లాక్కొవాలని భూషణ్ యాదవ్ స్కెచ్ వేశాడు.
కేటుగాడి ఫ్రెండ్ ఎంట్రీతో ?
రమ్యశ్రీని మనం ఇంకా ఎక్కువ బ్లాక్ మెయిల్ చేస్తే మనం ఇంకా ఎక్కువగా బంగారు నగలు తెప్పించుకోవచ్చని భూషణ్ యాదవ్ అతని స్నేహితుడు, కేఆర్ పురం నివాసి వివేక్ రెడ్డి (21) అనే యువకుడికి చెప్పాడు. 2019లో రమ్యశ్రీని బెదిరించిన భూషణ్, వివేక్ రెడ్డి ఆమెను రాచేనహళ్ళి చెరువు సమీపంలోకి పిలిపించుకున్నారు. తరువాత అక్కడ రమ్యశ్రీతో అసభ్యంగా ప్రవర్తించి దానిని వీడియో తీశారు.
అత్త మంగళసూత్రం చోరీ చేసిన అమ్మాయి
నీ నగ్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని భూషణ్ యాదవ్, వివేక్ రెడ్డి ఆమెను మళ్లీ బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టారు. నిందితుల దెబ్బతో భయపడిపోయిన రమ్యశ్రీ ఆందోళన చెందింది. రమ్యశ్రీ ఆమె మేనత్త మంగళసూత్రం చోరీ చేసి నిందితులకు ఇచ్చింది.
దెబ్బకు కేటుగాళ్ల మైండ్ బ్లాక్
తరువాత కూడా కేటుగాడు భూషణ్ యాదవ్, అతని ఫ్రెండ్ వివేక్ రెడ్డి మళ్లీ బ్లాక్ మెయిల్ చెయ్యడంతో సహనం కోల్పోయిన రమ్యశ్రీ బెంగళూరులోని అమృతహళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. రమ్యశ్రీ చేసిన పనికి మాజీ ప్రియుడు భూషణ్ యాదవ్, వివేక్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యింది. పోలీసులు భూషణ్ యాదవ్, వివేక్ రెడ్డిని అరెస్టు చేసి బెండ్ తీస్తున్నారు.