బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady: రైతు సంఘం లీడర్ భార్య ఎంతపని చేసింది ?, ఇద్దరు కూతుర్లకు విషం పెట్టి ఆత్మహత్య, అత్త మీద !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/రామనగర్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రైతు సంఘం నాయకుడు అయిన భర్తకు ఆ పరిసర ప్రాంతాల్లో మంచిపేరు ఉంది. భర్త కుటుంబ సభ్యులతో గొడవపడిన భార్య వేరుకాపురం పెట్టాలని భర్త మీద ఒత్తిడి చేసింది. తోటలో కట్టుకున్న ఇంటికి రైతు సంఘం నాయకుడు భార్యతో కలిసి వేరుకాపురం వెళ్లాడు.

ఇటీవల రైతు సంఘం నాయకుడి తల్లి అనారోగ్యానికి గురికావడం రైతు సంఘం నాయకుడి భార్య అత్త ఇంటికి వెళ్లింది. తరువాత దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇద్దరు కుమార్తెలకు విషం పెట్టిన తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే రైతు సంఘం నాయకుడి తల్లి కోడలికి, ఆమె పిల్లలకు విషం పెట్టి హత్య చేసిందని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

Model: నా మొగుడు దుబాయ్ లో ఉన్నాడు, వస్తే స్వర్గం చూపిస్తా, వస్తావా ?, ఎగరేసుకుంటూ వెళ్లిన వ్యాపారవేత్త!Model: నా మొగుడు దుబాయ్ లో ఉన్నాడు, వస్తే స్వర్గం చూపిస్తా, వస్తావా ?, ఎగరేసుకుంటూ వెళ్లిన వ్యాపారవేత్త!

 రైతు సంఘం నాయకుడి ఫ్యామిలీ

రైతు సంఘం నాయకుడి ఫ్యామిలీ

కర్ణాటకలోని రామనగర జిల్లాలోని మాగడి తాలుకాలో హోసపాళ్య (బెంగళూరు శివార్లు)లో లోకేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రామనగర జిల్లా రైతు సంఘం నాయకుడు అయిన లోకేష్ రామనగర జిల్లాతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో మంచిపేరు ఉంది. లోకేష్ చాలా సంవత్సరాల క్రితం రూపా (38) అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

వేరు కాపురం పెట్టిన లీడర్

వేరు కాపురం పెట్టిన లీడర్

లోకేష్, రూపా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. లోకేష్, రూపా దంపతులకు హర్షితా (6), సూర్పి (4) అనే ఇద్దకు కుమార్తెలు ఉన్నారు. భర్త లోకేష్ కుటుంబ సభ్యులతో గొడవపడిన అతని భార్య రూపా వేరుకాపురం పెట్టాలని భర్త మీద ఒత్తిడి చేసింది. తోటలో కట్టుకున్న ఇంటికి రైతు సంఘం నాయకుడు లోకేష్ నాలుగు నెలల క్రితమే భార్య రూపాతో కలిసి వేరుకాపురం వెళ్లాడు.

అత్తారింటికి వెళ్లిన రూపా

అత్తారింటికి వెళ్లిన రూపా

ఇటీవల రైతు సంఘం నాయకుడు లోకేష్ తల్లి అనారోగ్యానికి గురిఅయ్యారు. రైతు సంఘం నాయకుడు లోకేష్ బార్య రూపా, ఇద్దరు కుమార్తెలు కలిసి మళ్లీ అత్తారింటికి వెళ్లింది. తరువాత లోకేష్, రూపా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. పెద్దలు సర్దుకుపోవాలని లోకేష్, రూపా కుటుంబ సభ్యులకు సర్దిచెబుతూ వస్తున్నారు.

కూతుర్లను హత్య చేసి తల్లి ఆత్మహత్య?

కూతుర్లను హత్య చేసి తల్లి ఆత్మహత్య?

రాత్రి భర్త లోకేష్ తో గొడవపడిన రూపా ఆమె ఇద్దరు కుమార్తెలు హర్షితా, స్పూర్పికి విషం పెట్టి హత్య చేసిన రూపా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే లోకేష్ తల్లి కోడలు రూపాకు, ఆమె ఇద్దరు కుమార్తెలకు విషం పెట్టి హత్య చేసిందని ఆమె కుటుంబ సభ్యులు మాగడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Family: Mother commits suicide with her two daughters in Magadi near Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X