Fraud: బ్యాంకుకు కుచ్చుటోపీ, కావేరీ కంపెనీకి చుక్కలు చూపించిన ఈడీ, దెబ్బకు ఢమాల్!
బెంగళూరు: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కంపెనీ మీద ఈడీ అధికారులు పంజా విసిరారు. కోట్లకు కోట్లు రుణం తీసుకుని బ్యాంకును మోసం చేసిన కంపెనీకి చెందిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ నిర్వహకులు అక్రమంగా వారికి కావలసిన కంపెనీలకు అక్రమంగా నగదు బదిలి చేశారని వెలుగు చూసింది. 2015లో అక్రమంగా నగదు లావాదేవీలు నిర్వహించారని, మనీలాండరింగ్ కు పాల్పడ్డారని సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు.
Illegal affair: లేడీ టీచర్, లేడీ లీడర్, విలన్ ఎవరంటే ?, సీన్ రివర్స్, మ్యాటర్!
బ్యాంకులో ఎన్ని కోట్లు రుణం తీసుకున్నారంటే?
బ్యాంకు నుంచి రూ. 45 కోట్ల రుణం తీసుకున్న ఆ కంపెనీ నుంచి ఈడీ అధికారులు రూ. 40.14 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన కావేరీ టెలికామ్ ఇన్ ఫ్రాస్టక్షర్.లి. కంపెనీకి చెందిన ఆస్తులను గురువారం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం కూపీలాగితే?
బెంగళూరులోని ఈ కంపెనీకి చెందిన అపార్ట్ మెంట్లు, ఫ్లాట్ లు, వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీకి చెందిన బ్యాంకు అకౌంట్ లు సీజ్ చేశారని వెలుగు చూసింది, ప్రముఖ బ్యాంక్ లోఈ కావేరీ టెలికామ్ ఇన్ ఫ్రాస్టక్షర్.లి. కంపెనీ నిర్వహకులు కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు.
ఈడీ దెబ్బతో దిమ్మతిరిగిపోయింది
బ్యాంకు అధికారులకు చెప్పింది ఒకటి, తరువాత జరిగింది ఒకటి. ఈ విషయం పసిగట్టిన బ్యాంకు అధికారులు ఈడీ అధికారులను ఆశ్రయించారు. ఈ కంపెనీ నిర్వహకులు అక్రమంగా వారికి కావలసిన కంపెనీలకు అక్రమంగా నగదు బదిలి చేశారని వెలుగు చూసింది. 2015లో అక్రమంగా నగదు లావాదేవీలు నిర్వహించారని, మనీలాండరింగ్ కు పాల్పడ్డారని సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఈడీ అధికారుల దెబ్బతో ఈ కంపెనీ నిర్వహకుల దిమ్మతిరిగిపోయింది.