IT HUB: బెంగళూరులో పంజా విప్పిన కరోనా కేసులు, ఈస్ట్ జోన్ టాప్, అపార్ట్ మెంట్ లు, విల్లాల్లోనే ఎక్కువ!
బెంగళూరు: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. కరోనా వేవ్ థర్డ్ వేవ్ తగ్గిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో మరోసారి కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో మరోసారి కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో బీబీఎంపీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈసారి బెంగళూరులోని మురికివాడల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంలేదని, అపార్ట్ మెంట్ లు, విల్లాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిసిందని బీబీఎంపీ ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. బెంగళూరు ఈస్ట్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు.
Marriage: లవ్ మ్యారేజ్, బార్యది విలాసవంతమైన జీవితం, యూట్యూబ్ స్కెచ్ తో ?, అప్పట్లో హైదరాబాద్!
హడలిపోయిన ఐటీ హబ్
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. కరోనా వేవ్ థర్డ్ వేవ్ తగ్గిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో మరోసారి కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో మరోసారి కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో బీబీఎంపీ అధికారులు అలర్ట్ అయ్యారు.
బెంగళూరులో మహదేవపుర టాప్
బెంగళూరులో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం మహదేవపుర డివిజన్, బెంగళూరు ఈస్ట్ ప్రాంతంలో ఉన్నాయని బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మహదేవపురలో 25 కేసులు, బెంగళూరు తూర్పు విభాగంలో 18 కేసులు నమోదు అయ్యాయని ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
హడలిపోతున్న ప్రజలు
బెంగళూరు గురువారం 91 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరులో మహదేవపుర జోన్ లోనే 85 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఈస్ట్ జోన్ లో 25 కేసులు నమోదు అయ్యాయని బీబీఎంపీ అధికారులు తెలిపారు. బెంగళూరు ఈస్ట్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు.
ముంబాయి, ఢిల్లీ ఎఫెక్ట్
ఈసారి బెంగళూరులోని మురికివాడల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంలేదని, అపార్ట్ మెంట్ లు, విల్లాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిసిందని బీబీఎంపీ ఆరోగ్యశాఖ డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేంద్ర అంటున్నారు. బెంగళూరు ఈస్ట్ ప్రాంతంలో నమోదు అయిన 25 కేసుల్లో 12 కేసులు ఢిల్లీ, అహమ్మదాబాద్, ముంబాయి నుంచి ప్రయాణించిన వారివే ఉన్నాయని అధికారులు అంటున్నారు.