మరో ఘోరం: మాండ్యా ఆలయంలో ముగ్గురు అర్చకుల దారుణ హత్య, హుండీల దోపిడీ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాండ్యా నగర శివారు గుట్టల్లోని శ్రీ అరకేశ్వర ఆలయంలోని ముగ్గురు అర్చకులు దారుణంగా హత్య చేయబడ్డారు. వారిని దుండుగులు బండరాళ్లతో కొట్టిచంపారు. ఆలయ ద్వారాలు తెరిచిన గ్రామస్తులు ఈ దారుణం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతులను గణేష్, ప్రకాశ్, ఆనంద్లుగా గుర్తించారు. ఆలయ కాపాలాగ ఉండే ఈ ముగ్గురు అర్చకులను దారుణంగా హతమార్చిన దుండగులు.. ఆలయంలోని హుండీలను దోచుకున్నారు. హుండీలను పగలగొట్టి.. నాణేలను వదిలేసి, కరెన్సీ నోట్లను మాత్రమే దోచుకెళ్లారు.

ముజ్రాయి శాఖ కింద బీ గ్రూప్ టెంపుల్గా ఈ ఆలయం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఐజీపీ విపుల్ కుమార్ మైసూరు నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురు కంటే ఎక్కువ మందే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. దోపిడీ దొంగలే ఈ దారుణాలకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. మూడు హుండీలను పగలగొట్టి డబ్బులను ఎత్తుకెళ్లారని గుర్తించారు. నగదు, బంగారం కోసం ఆలయ గర్భగుడిలో దొంగలు బీభత్సం సృష్టించారని పోలీసులు తెలిపారు.
ಮಂಡ್ಯದ ಅರಕೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದ ಪೂಜಾರಿಗಳಾಗಿದ್ದ ಶ್ರೀ ಗಣೇಶ್, ಶ್ರೀ ಪ್ರಕಾಶ್ ಮತ್ತು ಶ್ರೀ ಆನಂದ್ ಅವರನ್ನು ದುಷ್ಕರ್ಮಿಗಳು ಹತ್ಯೆ ಮಾಡಿ ದೇವಸ್ಥಾನದ ಹುಂಡಿಯನ್ನು ಕಳ್ಳತನ ಮಾಡಿರುವ ವಿಷಯ ತಿಳಿದು ಅತ್ಯಂತ ನೋವಾಗಿದೆ. (1/2)
— CM of Karnataka (@CMofKarnataka) September 11, 2020
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్నిఫ్ఫర్ డాగ్స్, ఫోరెన్సిక్ నిపుణులతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఓ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మాండ్యా ఎస్పీ పరశురాం తెలిపారు. కాగా, ఘటనపై ఈ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications