Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒకే దెబ్బకు రెండు పిట్టలు, అసెంబ్లీ స్పీకర్ ఏం చేశారంటే, తాతల ఆస్తిని ఏకంగా!

బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పేరు చెబితే మతాఘర్షణలు, అల్లర్లు జరగబోతుంటాయనే పేరు ఉంది. ఈ ప్రాంతంలో హిందూ, ముస్లిం రాజకీయాలు మరింత వేడిగా ఉంటాయని నిత్యం వార్తలు వస్తుంటాయి. ఇంత జరుగుతున్నా అక్కడ కొందరు హిందూ-ముస్లింలు స్నేహపూర్వకంగా జీవిస్తున్నారు.

నాగారాధన నాగరాళ్ల కోసం ప్రత్యేక పూజలు చెయ్యడంలో ఈ ప్రాంతంలో గొప్ప ఆచారాలలో ఒకటి. నాగరాళ్లను పూజించడం కోసం, హిందువులు నిత్యం పూజలు చేసుకోవడానికి వీలుగా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటీ. ఖాదర్ ఒక హిందూ కుటుంబానికి ఉచితంగా ఆయన సొంత భూమిని ఇచ్చారు.

Karnataka Assembly Speaker UT Khader has given his own land for free for Hindu Naga Panchami pujas

దక్షిణ కన్నడ జిల్లా విట్ల సమీపంలోని పూనాచ పరియల్తడ్కలో యు.టీ. ఖాదర్‌కు వారసత్వంగా వచ్చిన భూమి ఉంది. ఎన్నో తరాలుగా అక్కడ నాగాళ్లకు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. తర్వాత ఈ భూమి యూటీ ఖాదర్ తాత మహమ్మద్ హాజీ ఆధీనంలోకి వచ్చింది. అందులో వాల్‌నట్‌, తాటి చెట్లను నాటారు. ఆ భూమిలో కొంత భాగంలో ఉన్న నాగరాళ్లకు ప్రత్యేక పూజలు చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం యుటి ఖాదర్‌కు చెందిన భూమి గతంలో దళవాయి కుటుంబానికి చెందినది. భూసేకరణ చట్టం తర్వాత ఖాదర్ కుటుంబ పెద్దలకు ఈ భూమి దక్కింది. భూ విభజన తర్వాత వారసత్వ ఆస్తిగా ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్, మాజీ మంత్రి యూటీ? ఖాదర్ కు వచ్చింది. దళవాయి కుటుంబానికి చెందిన నాగారాధన చేస్తూ నాగరాళ్లు ఉన్న గుడి యూటి. ఖాదర్ భూమిలోనే ఉంది.

Karnataka Assembly Speaker UT Khader has given his own land for free for Hindu Naga Panchami pujas

నాగారాధన స్థలం ముస్లింలకు చెందిన స్థలంలో ఉండటంతో దళవాయి కుటుంబీకులు వేరే ప్రదేశంలో పూజలు చేసేవారు. అసలు స్థలంలో జరుగుతున్న పూజలు ఆగిపోవడంతో దళవాయి కుటుంబీకులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై దళవాయి కుటుంబీకులు అష్టమంగళాలను అడగడంతో అసలు స్థలంలోనే నాగారాధన నిర్వహించాలని సూచించారు. అయితే అసలు భూమి ఖాదర్‌దే కావడంతో దళవాయి కుటుంబానికి మళ్లీ సమస్య ఎదురైంది.

మరో మార్గం లేకపోవడంతో నాగరాళ్ల కట్ట ఉన్న 10 సెంట్ల భూమిని కొనుగోలు చేయాలని దళవాయి కుటుంబం నిర్ణయించింది. యు.టి. ఖాదర్‌కు ఈ విషయం తెలియజేసి ఆ భూమి మాకు విక్రయించాలని మనవి చేశారు. అసలు విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఖాదర్ దళవాయి కుటుంబానికి 10 సెంట్ల భూమికి బదులుగా 20 సెంట్ల భూమిని ఉచితంగా ఇచ్చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ముస్లింలకు చెందిన 12 ఎకరాల భూమి మధ్యలో నాగరాళ్లు ఉండటం, అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+