బీజేపీతో సహ కాంగ్రెస్ కు కూడా ఎన్నికల ప్రచారం చేస్తారా ఈ హీరో? ఏం జరుగుతోంది?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా జరిగే అవకాశం ఉందని వెలుగు చూస్తోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరడం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బీజేపీలో చేరిపోయారు. ఇదే సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నాయకులు జంప్ అవుతూ వస్తున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సుదీప్ ఆ రోజు సీఎం బోమ్మయ్ సొంత నియోజక వర్గం అయిన శిగ్లావిలో ఎన్నిక ప్రచారం చేశారు.

ఇప్పుడు కర్ణాటకలోని పలు నియోజక వర్గాల్లో హీరో సుదీప్ బీజేపీ నాయకులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని హీరో సుదీప్ సుడిగాలి పర్యటనలో ఉన్నారు. ఇదే సమయంలో హీరో సుదీప్ కొంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మద్దతుగా ఎన్నిలక ప్రచారం చేస్తారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సుధీప్ బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నాయకుల తరపున ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉందని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇదే సమయంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, హీరో సుదీప్ కలిసి చాలా క్లోజ్ గా తీసుకున్న ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తం మీద హీరో సుదీప్ బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఎన్నిలక ప్రచారం చేస్తారా ?, లేదా ? అనే వియషం వేచిచూడాలి.
ఇప్పటికే బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతన్న హీరో సుదీప్ ను తప్పుదోవ పట్టించడానికి కొందరు నాయకులు ఎత్తులు వేస్తున్నారని, అలాంటి నాయకుల కలలు నెరవేరవని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తాను ప్రచారం చెయ్యనని హీరో సుదీప్ తో పాటు ఆయన అభిమానులు ఎక్కడా ఖండించకపోవడంతో సామాన్య ప్రజలు అయోమయంలో పడిపోయారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications