బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rains: నిన్న చెన్నై, నేడు ఐటీ హబ్, వర్షాల దెబ్బతో ప్రజలు, నాలుగు రోజులు సేమ్ సీన్, ఆంధ్రాను వదల్లేదు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దెబ్బతో ఇప్పటికే తమిళనాడు అతలాకుతలం అయ్యింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల దెబ్బతో ప్రజలు హడలిపోయారు. పక్కన ఉన్న కర్ణాటక, కేరళ రాష్ట్రాల మీద వాయుగుండం ప్రభావం చూపించింది. బంగాళాఖాతంలోని వాయుగుండం తీరాన్ని తాకింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో కూడా వర్షాలుపడుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు విరామం లేకుండా బెంగళూరులో వర్షం కురుస్తూనే ఉంది. అయితే భారీ వర్షాలు పడకపోవడంతో ఐటీ హబ్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గురువారం బెంగళూరులోని అనేక రహదారుల్లో జనసంచారం లేక రోడ్లు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. వచ్చే నాలుగు రోజులు బెంగళూరులో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా కర్ణాటకలోని పలు జిల్లాల్లో శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తమిళనాడులో భారీ వర్షాల దెబ్బతో ఇప్పటి వరకు 14 మంది మరణించారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం మీద భారీ వర్షాల దెబ్బతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రజలు వనికిపోతున్నారు.

Illegal affair: పగలు ప్రియుడు.... రాత్రి మొగుడు, కోటీశ్వరుడి హత్య కేసులో ట్విస్ట్, ప్లాన్ బి రివర్స్ !Illegal affair: పగలు ప్రియుడు.... రాత్రి మొగుడు, కోటీశ్వరుడి హత్య కేసులో ట్విస్ట్, ప్లాన్ బి రివర్స్ !

 తమిళనాడు విలవిల

తమిళనాడు విలవిల

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దెబ్బతో ఇప్పటికే తమిళనాడు అతలాకుతలం అయ్యింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల దెబ్బతో ప్రజలు హడలిపోయారు. తమిళనాడులో భారీ వర్షాల దెబ్బతో ఇప్పటి వరకు 14 మంది మరణించారని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికారికంగా ప్రకటించింది.

 చెన్నై ఇంకా కోలుకోలేదు

చెన్నై ఇంకా కోలుకోలేదు

భారీ వర్షాల దెబ్బతో చెన్నై సిటీ చిత్తడి అయ్యింది. భారీ వర్షాల దెబ్బ నుంచి చెన్నై సిటీ ప్రజలు ఇంకా కోలుకోవడం లేదు. చెన్నైలోని పలు ప్రాంతాలు శుక్రవారం ఉదయం వరకు ఇకా జలవలయంలోనే చిక్కుకున్నాయి. రోడ్లు మీద నిలిచిపోయిన వరద నీటిని, ఇళ్లల్లోకి చేరుకుంటున్న వర్షం నీటిని బయటకు పంపించడానికి స్థానిక ప్రజలు, కార్పోరేషన్ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు.

బెంగళూరులో అలాంటి పరిస్థితితే..... కానీ ఎంతో మేలు

బెంగళూరులో అలాంటి పరిస్థితితే..... కానీ ఎంతో మేలు

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం పక్కన ఉన్న కర్ణాటకకు తాకింది. గురువారం ఉదయం నుంచి నుంచి శుక్రవారం ఉదయం వరకు విరామం లేకుండా బెంగళూరులో వర్షం కురుస్తూనే ఉంది. అయితే భారీ వర్షాలు పడకపోవడంతో ఐటీ హబ్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గురువారం బెంగళూరులోని అనేక రహదారుల్లో జనసంచారం లేక రోడ్లు ఖాళీగా దర్శనం ఇచ్చాయి.

బెంగళూరులో మరో నాలుగు రోజులు సేమ్ సీన్

బెంగళూరులో మరో నాలుగు రోజులు సేమ్ సీన్

వచ్చే నాలుగు రోజులు బెంగళూరులో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బెంగళూరు సిటీలోని లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బంధువుల ఇళ్లకు పరుగు తీస్తున్నారు. కర్ణాటకలోని పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా కర్ణాటకలోని పలు జిల్లాల్లో శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

Recommended Video

Chennai Rains: Policewoman Carries Unconscious Man | Oneindia Telugu
బెంగళూరులో ఇది పరిస్థితి

బెంగళూరులో ఇది పరిస్థితి


గురువారం మద్యాహ్నం వరకు ఐటీ హబ్ బెంగళూరు సిటీలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3.8 సె.మీ, హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో 3.5 సె,మీ వర్షం పడిందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. బెంగళూరు నగరంలో గురువారం వేకువ జామున నుంచి పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాలో చిరుజల్లలు కురుస్తుండటంతో వాతావరణం చాలా చల్లగా ఉంది. చలి దెబ్బతో చిన్న పిల్లలు, వృద్దులు వణికిపోతున్నారు. శుక్రవారం కూడా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.

English summary
Rains: The India Meteorological Department (IMD) has predicted rain to continue in Bengaluru and other districts of Karnataka for 4 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X