Shock: ఫ్రెండ్ తల్లి ఇంట్లో లెక్చరర్, జంట హత్యలు, ఆ శవం నగ్నంగా ఎందుకుంది ?, అర్దరాత్రి!
బెంగళూరు: బెంగళూరులో ఒకే ఇంట్లో తల్లి, ఆమె కొడుకు ఫ్రెండ్ హత్యకు గురికావడం కలకలం రేపింది. ఉద్యోగం కోసం 20 రోజుల ముందు బెంగళూరు వచ్చిన లెక్చరర్ ఫ్రెండ్ తల్లి ఇంట్లో దారుణ హత్యకు గురైనాడు. ఇంట్లో ఇద్దరిని దారుణంగా హత్య చేసి బంగారు, నగదుతో పాటు విలువైన వస్తులు లూటీ చేశారు. అయితే ఫ్రెండ్ తల్లి ఇంట్లో హత్యకు గురైన వ్యక్తి పూర్తిగా నగ్నంగా ఉండటంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హత్యకు గురైన మహిళ ఇంటి సమీపంలోనే ఆమె కొడుకు, కొట్లాడి వెళ్లిపోయిన కోడలు నివాసం ఉండటంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Drinker: సుఖపెట్టాలని భార్య చెబితే మొగుడు ఏం చేశాడంటే, ఆంటీతో ?, కత్తితో కసిగా !
జేపీ నగర్ రెండో స్టేజ్ లో !
బెంగళూరు నగరంలోని జేపీ నగర్ 2వ స్టేజ్ లోని పుట్టేనహళ్ళిలోని సంతృప్తి నగర్ లో మమతా బసు (71) అనే మహిళ నివాసం ఉంటున్నారు. చాలా సంవత్సరాల క్రితమే మమతా బసు కుటుంబ సభ్యులు బెంగళూరు వచ్చి జేపీ నగర్ లో సొంత ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.
అత్తా, కోడలు ఢిష్యూం ఢిష్యూం
మమతా బసు కుమారుడు దేవ్ బసు బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. 2018లో దేవ్ బసుకు వివాహం అయ్యింది. వివాహం జరిగిన తరువాత మమతా బసుకు, ఆమె కోడలి మద్య తేడాలు వచ్చాయి. అత్తా కోడలు పదేపదే గొడవలు పడటంతో దేవ్ బసు విసిగిపోయాడు.
తల్లి ఇంట్లో స్నేహితుడు
తల్లి
నివాసం
ఉంటున్న
ఇంటి
పక్క
వీధిలో
దేవ్
బసు,
అతని
భార్య
ప్రత్యేకంగా
కాపురం
ఉంటున్నారు.
మమతా
బసు
మాత్రం
రెండు
అంతస్తుల
భవనంలో
ఒంటరిగా
ఉంటోంది.
దేవ్
బసు
స్నేహితుడు
దేవ్
బ్రత్
పశ్చిమ
బెంగాల్
లో
ఉంటున్నాడు.
బెంగళూరులోని
ఓ
ప్రైవేట్
కాలేజ్
లో
లెక్చరర్
గా
ఉద్యోగం
రావడంతో
20
రోజుల
క్రితమే
బెంగళూరు
వచ్చిన
దేవ్
బ్రత్
స్నేహితుడి
తల్లి
మమతా
బసు
ఇంట్లో
ఉంటూ
ఉద్యోగానికి
వెళ్లి
వస్తున్నాడు.
రాత్రి ఏంజరిగిందంటే ?
రాత్రి దేవ్ బసు తల్లి మమతా బసు ఇంటికి వెళ్లాడు. రాత్రి 9 గంటల వరకు తల్లి మమతా బసు, స్నేహితుడు దేవ్ బ్రత్ తో మాట్లాడిన దేవ్ బసు అక్కడే భోజనం చేసి తరువాత పక్క వీధిలోని అతని ఇంటికి వెళ్లిపోయాడు. కొడుకు వెళ్లిపోయిన తరువాత మమతా బసు మేడమీద ఉన్న గదిలోకి వెళ్లి నిద్రపోయింది. కింది అంతస్తులోని రూమ్ లో దేవ్ బ్రత్ నిద్రపోయాడు.
అర్దరాత్రి అరాచకం
అర్దరాత్రి దాటిన తరువాత మమతా బసు ఇంట్లో చొరబడిన దుండుగుడు నేరుగా మేడ మీదకు వెళ్లాడు. మేడమీద నిద్రపోతున్న మమతా బసును కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. తరువాత కింది అంతస్తులో నిద్రపోతున్న మమతా బసు కొడుకు స్నేహితుడు దేవ్ బ్రత్ ను కత్తితో పొడిచి చంపేశాడు. ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు, ఏటీం కార్డు విలువైన వస్తులు లూటీ చేసి అక్కడి నుంచి పరారైనారు.
నగ్నంగా లెక్చరర్ మృతదేహం
మరుసటి రోజు ఇంటి పనిమనిషి వెళ్లి చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో శవమై కనిపించడంతో జంట హత్యలు జరిగిన విషయం వెలుగు చూసింది. పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్యకు గురైన దేవ్ బ్రత్ నగ్నంగా పడి ఉండటంతో పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
ఎందుకోసం ఇంత జరిగింది ?
పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు. అర్దరాత్రి బైక్ లో ఓ వ్యక్తి మమతా బసు ఇంటి దగ్గరకు వెళ్లాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దొంగలే జంట హత్యలు చేశారా ?, తెలిసిన వాళ్లే ఒంటరి మహిళను చంపి డబ్బులు, నగలు లూటీ చెయ్యాలని వెళ్లి మరో వ్యక్తిని కూడా చంపేశారా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా .? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.