తేనెటీగల దాడి: భర్త మృతి, భార్య పరిస్థితి విషమం!
లక్నో: తేనెటీగల దాడిలో భర్త మరణించగా, భార్య తీవ్రంగా గాయపడిన ఉదంతమిది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని రతన్లాల్ నగర్లో సోమవారం చోటుచేసుకుంది.
రతన్లాల్ నగర్లోని తమ ఇంటిముందు సత్నాం మంజ్వాని(60), ఆయన భార్య గౌరి నిలబడి మాట్లాడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎక్కడ్నించి వచ్చాయో తెలియదుగానీ హఠాత్తుగా వారిపైన తేనెటీగల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో వారి బంధువు ప్రకాష్ కూడా గాయపడ్డాడు.

ఇది గమనించగానే ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన సత్నాం మంజ్వాని తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోగా అతడ్ని, అతడి భార్య గౌరిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మంజ్వాని మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
మరోవైపు తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన మంజ్వాని భార్య గౌరి సాకేత్ నగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు అక్కడి వైద్యులు పేర్కొన్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications