Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తేనెటీగల దాడి: భర్త మృతి, భార్య పరిస్థితి విషమం!

లక్నో: తేనెటీగల దాడిలో భర్త మరణించగా, భార్య తీవ్రంగా గాయపడిన ఉదంతమిది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని రతన్‌లాల్ నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది.

రతన్‌లాల్ నగర్‌లోని తమ ఇంటిముందు సత్నాం మంజ్వాని(60), ఆయన భార్య గౌరి నిలబడి మాట్లాడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎక్కడ్నించి వచ్చాయో తెలియదుగానీ హఠాత్తుగా వారిపైన తేనెటీగల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో వారి బంధువు ప్రకాష్ కూడా గాయపడ్డాడు.

Bee Attack Kills Man In UP, Leaves Wife Critically Injured

ఇది గమనించగానే ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన సత్నాం మంజ్వాని తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోగా అతడ్ని, అతడి భార్య గౌరిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మంజ్వాని మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.

మరోవైపు తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన మంజ్వాని భార్య గౌరి సాకేత్ నగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు అక్కడి వైద్యులు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+