EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం బిగ్ న్యూస్..! ఇక ఆటోమేటిక్ రిఫండ్..!
మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని పీఎఫ్ ఖాతాల్లో కనీస నిల్వ వెయ్యి, అంతకంటే తక్కువ ఉంటే దాన్ని ఆటోమేటిగ్గా వారి సేవింగ్స్ ఖాతాలకు పంపబోతున్నారు.
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం ఇవాళ భారీ ఊరట కల్పించే వార్త చెప్పింది. ఈపీఎఫ్ (EPFO)ఖాతాల్ని ఓ దశ వరకూ నిర్వహించే ఆ తర్వాత వదిలేసిన వాటిలో మిగిలిపోయిన డబ్బుల్ని ఆటోమేటిగ్గా ఖాతాదారులకు చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఎవరికి వర్తిస్తుందో కూడా కేంద్రం వెల్లడించింది. దీంతో వారు ఇకపై ఆ డబ్పుల కోసం పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలిపింది.
పీఎఫ్ ఖాతాల్లో చిన్న చిన్న బ్యాలెన్స్ లు మిగిలిపోయి, ఇన్ ఆపరేట్ గా ఉన్న ఖాతాలుంటే వాటిలో ఖాతాదారులు దాచుకున్న వెయ్యి లేదా అంత కంటే తక్కువ మొత్తాల్ని ఆటోమేటిగ్గా వాటికి లింక్ అయి ఉన్న సేవింగ్స్ ఖాతాల్లోకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఒక పైలట్ ప్రాజెక్ట్ను ఆమోదించింది. దీనికి ఖాతాదారులు ఎటువంటి దరఖాస్తు లేదా పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.

మూడు సంవత్సరాల పాటు ఎటువంటి చందా చెల్లించకుండా, లావాదేవీ జరగకుండా ఉంటే సదరు ఈపీఎఫ్ఓ ఖాతాను నిరుపయోగంగా పరిగణిస్తారు. తాజా నిర్ణయం ప్రకారం ఇందులో వెయ్యి లేదా అంతకన్నా తక్కువ నిల్వ ఉంటే ఆ డబ్బును నేరుగా చందాదారుల లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. లబ్ధిదారులు ఈ ప్రక్రియకు ఎటువంటి క్లెయిమ్ దాఖలు చేయనవసరం లేదు.

ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడు లక్షలకు పైగా నిరుపయోగ ఖాతాలు ఉన్నాయి. ఆధార్తో లింక్ చేసిన ఈ ఖాతాలకు సొమ్ము తక్షణమే చెల్లిస్తారు. మిగిలిన అర్హత కలిగిన ఖాతాలకు బదిలీలు దశలవారీగా జరుగుతాయి.ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, మిగిలిన 25 లక్షల నిరుపయోగ ఖాతాలను కూడా ఇలాంటి స్వయంచాలక వాపసు విధానం కిందకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ ఖాతాలు గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి కార్యకలాపాలు లేనివి, 20 సంవత్సరాలకు పైగా పాతవి కూడా. నిధుల సెటిల్మెంట్ను క్రమబద్ధీకరించడం, రాతపని తగ్గించడం, కార్మికులకు త్వరితంగా డబ్బులు అందించడమే దీని ఉద్దేశం.
-
పాకిస్తాన్ అనాగరిక దాడి- తీవ్రంగా స్పందించిన భారత్..! -
రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..? -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications