చివరి త్రైమాసిక ఫలితాలు: ఇన్ఫోసిస్ లాభం రూ.3,690 కోట్లు
ముంబై: ఇన్ఫోసిస్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను చివరి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. జనవరి - మార్చి త్రైమాసికానికి గాను ఇన్ఫోసిస్ రూ.3,690 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 28.2 శాతం క్షీణించింది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 5,129 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
అయితే 2016-17 సంవత్సరానికి నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 2.4 శాతం వృద్ధి సాధించింది. గత ఏడాది జనవరి -మార్చిలో సంస్త లాభం రూ.3603 కోట్లుగా ఉంది.

ఈ త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.18,083 కోట్లు కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017-2018 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ లాభం 11.7 శాతం పెరిగింది.
ఆదాయం 3 శాతం పెరిగి రూ.70,522 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ సీఈవోగా సలీల్ పరేఖ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన తొలి త్రైమాసిక ఫలితాలు ఇవి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications