సుప్రీం జడ్జిల ప్రెస్ మీట్ ఎఫెక్ట్: మార్కెట్పై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదని భారతదేశ న్యాయవ్యవస్థలో తొలిసారి నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం కలకలం రేపుతోంది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల పైన కూడా పడింది. ట్రేడింగ్ ఆరంభం నుంచి లాభాల్లో పయనించిన సూచీలు ఈ సమావేశం నేపథ్యంలో ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి.

ఒకానొక దశలో సెన్సెక్స్ 110 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 79 పాయింట్ల నష్టంతో 34,424 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 10,621 వద్దట్రేడ్ అయ్యాయి.












Click it and Unblock the Notifications