వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండున్నరేళ్ల గరిష్టానికి రూపాయి మారకం విలువ
ముంబై: గత రెండున్నరేళ్ల కాలం తర్వాత రూపాయి మారకం విలువ గరిష్టానికి చేరుకుంది. యూఎస్ డాలర్ మారకం విలువ రూ.63.44కు చేరుకుంది. 2015, జులై తర్వాత ఇదే గరిష్టం కావడం గమనార్హం.
ఇది ఇలా ఉండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ మంగవారం ఉదయం 55 పాయింట్లు లాభపడి 10,491 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించింది. మరోసారి 10,500 పాయింట్ల స్థాయికి అతిచేరువలో ప్రారంభమయ్యింది. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 33,960 దగ్గర మొదలయ్యింది.ౌ
నిఫ్టీ ఇండీసెస్లో పీఎస్యూ బ్యాంక్ 0.76 శాతం నష్టాల్లో ట్రేడవుతుండగా.. ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాలు ఫ్లాట్గా ఉన్నాయి. మిగిలిన అన్ని రంగాలు లాభాల్లోనే ఉండగా.. మీడియా అత్యధికంగా అరశాతం లాభాల్లో కొనసాగింది.
English summary
The rupee (INR) surged to a nearly two-and-a-year high of 63.44 against the US dollar, continuing its strength against the greenback in the New Year 2018. This is the highest value of the rupee against the US dollar since July 2015.
Story first published: Tuesday, January 2, 2018, 23:15 [IST]