బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు... యజమాని సహా ఏడుగురు మృతి...
తమిళనాడులోని కడలూరులో ఉన్న ఓ బాణసంచా కర్మాగారంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా... నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఫ్యాక్టరీ యజమాని కూడా ఉన్నాడు.
పేలుడు ధాటికి కూలిన ఫ్యాక్టరీ శిథిలాల కింద మృతదేహాలు చిక్కుకుపోయాయి. ప్రమాద ఘటన గురించి తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడారు. మృతుల కుటుంబీకులు రోధనలతో అక్కడి వాతావరణం ఉద్విగ్నంగా మారింది.
ప్రమాదంపై కడలూరు ఎస్పీ శ్రీ అభినవ్ మాట్లాడుతూ... కట్టుమన్నార్కోయిల్లో ఉన్న ఆ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఉందన్నారు. మృతులంతా అందులో పనిచేసేవాళ్లేనని చెప్పారు. అనుమతి వున్న పేలుడు పదార్థాలనే ఫ్యాక్టరీలో ఉపయోగిస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ప్రతీ ఏటా దీపావళికి ముందు బాణసంచా ప్రొడక్షన్ పీక్స్లో ఉంటుంది. కానీ ఈసారి కరోనా కారణంగా తయారీ నిలిచిపోయింది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కేవలం 100 మంది సిబ్బందితో పరిశ్రమలు నడిపేందుకు అనుమతినివ్వడంతో ఇప్పుడిప్పుడే అన్ని పరిశ్రమలు రీఓపెన్ అవుతున్నాయి.
కాగా,దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో బాణసంచా తయారీ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని శివకాశీ ఒకరకంగా ఫైర్వర్క్స్ కేపిటల్గా కొనసాగుతోంది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications