Illegal affair: భర్త చనిపోయి వారం కాకుండానే కోడలు ?, అత్తకు డౌట్, మొబైల్ ఫోన్ లో!
చెన్నై/తిరుపత్తూర్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకున్నాడు. దంపతులకు కొడుకు కూతురు ఉన్నారు. సొంతంగా షాపు పెట్టుకున్న భర్త బాగానే డబ్బులు సంపాధిస్తున్నాడు. దంపతులు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే భర్త చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడు దంపతుల ఇంటికి వెలుతున్నాడు. భర్త మద్యం సేవించడానికి రాను అని చెప్పినా అతని స్నేహితుడు బలవంతంగా బయటకు పిలుచుకుని వెళ్లాడని తెలిసింది. మద్యం సేవించిన భర్త తీవ్ర అస్వస్థతకు గురైనాడు.
తరువాత భర్తను బార్ లో నుంచి అతని స్నేహితుడు ఇంటికి పిలుచుకుని వచ్చి వదిలేశాడు. భర్త నోటీలో నురుగు రావడంతో అతని భార్య, స్నేహితుడు కలిసి నీళ్లు తాగించారు. కొంతసేటి తరువాత కుటుంబ సభ్యులు భర్తను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. విపరీతంగా మద్యం సేవించడం వలనే భర్త చనిపోయాడని అనుకున్న కుటుంబ సభ్యులు అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. కొడుకు చనిపోయిన ఐదు రోజులు కాకుండానే కోడలు గంటల గంటలు ఎవరితోనో మాట్లాడుతుందని గమనించిన అత్తకు అనుమానం వచ్చింది.
కోడలు స్నానం చేస్తున్న సమయంలో ఆమె మొబైల్ ఫోన్ ఎత్తుకుని అత్త పరిశీలించింది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న కొడుకు స్నేహితుడితో తన కోడలు గంటలు గంటలు మాట్లాడుతోందని గుర్తించిన అత్త పోలీసులకు సమాచారం ఇచ్చింది. జిల్లా ఎస్పీ, తహసిల్దార్, డీఎస్పీ, ఎమ్మార్వో తదితరులు చనిపోయిన వ్యక్తి శవాన్ని బయటకు తీసి పోర్టుమార్టం నిర్వహించారు. భర్త చనిపోయాడు అనే బాధకంటే కోడలు ఎక్కువగా ఆమె ప్రియుడితో మాట్లాడుతోందని గమనించి అత్తమామలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు కథ మొదలైయ్యింది.
Illegal affair: భర్తతో సెకండో షో, ప్రియుడితో మార్నింగ్ షో, సైలెంట్ గా స్పాట్ పెట్టేశాడు!
భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త
తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలోని మట్రపల్లి సమీపంలోని తన్నీర్ బండల్ ప్రాంతంలో మురుగన్ అనే ఆయన నివాసం ఉంటున్నాడు. మురుగన్ టీవీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మురుగన్ కుమారుడు నవీన్ కుమార్ (29) అదే ప్రాంతంలో సొంతంగా బార్బర్ షాప్ పెట్టుకున్నాడు. నవీన్ కుమార్ కు 8 సంవత్సరాల క్రితం సుచిత్రా (26) అనే యువతితో వివాహం అయ్యింది. భార్య సుచిత్రాతో కలిసి నవీన్ కుమార్ సంతోషంగాకాపురం చేస్తున్నాడు.
కొడుకు కూతురితో హ్యాపీలైఫ్
నవీన్ కుమార్, సుచిత్ర దంపతులు వివాహం అయిన ఐదు సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిసింది. సుచిత్రాను వివాహం చేసుకున్న నవీన్ కుమార్ అతని భార్యతో జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకున్నాడు. నవీన్ కుమార్, సుచిత్రా దంపతులకు కొడుకు కూతురు ఉన్నారు. సొంతంగా షాపు పెట్టుకున్న నవీన్ కుమార్ బాగానే డబ్బులు సంపాధిస్తున్నాడు.
భర్త ఫ్రెండ్ ఎంట్రీ
నవీన్ కుమార్, సుచిత్రా దంపతులు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే భర్త చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాసన్ (26) అనే యువకుడు నివాసం ఉన్నాడు. శ్రీనివాసన్ నవీన్ కుమార్, సుచిత్రా దంపతుల ఇంటికి వెలుతున్నాడు. ఆ సమయంలో సుచిత్రాకు శ్రీనివాసన్ కు చనువు ఏర్పడింది. భర్త నవీన్ కుమార్ లేని సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న శ్రీనివాసన్ తో సుచిత్రా రొమాన్స్ చెయ్యడం మొదలు పెట్టింది.
బలవంతంగా మద్యం తాగించేశారు
ఐదు రోజుల క్రితం ఇంట్లో ఉన్న నవీన్ కుమార్ మద్యం సేవించడానికి రాను అని చెప్పినా అతని స్నేహితుడు శ్రీనివాసన్ బలవంతంగా బయటకు పిలుచుకుని వెళ్లాడని తెలిసింది. తరువాత బార్ లో నవీన్ కుమార్, శ్రీనివాసన్, జనార్దన్ తదితరులు మద్యం సేవించారు. ఆ సమయంలో నవీన్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురైనాడు.
భర్త ప్రాణం పోయింది
తరువాత నవీన్ కుమార్ ను బార్ లో నుంచి అతని స్నేహితుడు శ్రీనివాసన్, మరో స్నేహితుడు జనార్దన్ కలిసి అతన్ని ఇంటికి పిలుచుకుని వచ్చి వదిలేశాడు. భర్త నవీన్ కుమార్ నోటీలో నురుగు రావడంతో అతని భార్య సుచిత్రా, స్నేహితుడు శ్రీనివాసన్, జనార్దన్ కలిసి నీళ్లు తాగించారు. కొంతసేటి తరువాత కుటుంబ సభ్యులు నవీన్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నవీన్ కుమార్ ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు.
కోడలు తీరుతో అత్తకు అనుమానం
విపరీతంగా మద్యం సేవించడం వలనే నవీన్ కుమార్ చనిపోయాడని అనుకున్న కుటుంబ సభ్యులు అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. కొడుకు నవీన్ కుమార్ చనిపోయిన ఐదు రోజులు కాకుండానే కోడలు సుచిత్రా గంటల గంటలు ఎవరితోనో మాట్లాడుతుందని గమనించిన అత్తకు అనుమానం వచ్చింది. కోడలు సుచిత్రా స్నానం చేస్తున్న సమయంలో ఆమె మొబైల్ ఫోన్ ఎత్తుకుని అత్త పరిశీలించింది.
కోడలికి పక్క వీధిలోనే ప్రియుడు ఉన్నాడని?
పక్కవీదిలోనే నివాసం ఉంటున్న తన కొడుకు నవీన్ కుమార్ స్నేహితుడు శ్రీనివాసన్ తో తన కోడలు సుచిత్రా గంటలు గంటలు మాట్లాడుతోందని గుర్తించిన అత్త పోలీసులకు సమాచారం ఇచ్చింది. జిల్లా ఎస్పీ, తహసిల్దార్, డీఎస్పీ, ఎమ్మార్వో తదితరులు చనిపోయిన నవీన్ కుమార్ శవాన్ని బయటకు తీసి పోర్టుమార్టం నిర్వహించారు.
Recommended Video
కిలాడీ కోడలు కథ క్లోజ్
భర్త నవీన్ కుమార్ చనిపోయాడు అనే బాధకంటే కోడలు సుచిత్రా ఎక్కువగా ఆమె ప్రియుడు శ్రీనివాసన్ తో మాట్లాడుతోందని గమనించి అత్తమామలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు కథ మొదలైయ్యింది. పోలీసులు సుచిత్రా, ఆమె ప్రియుడు శ్రీనివాసన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
నవీన్ కుమార్ పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, సుచిత్రా, శ్రీనివాసన్ గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడుకుంటున్న విషయం వెలుగు చూసిందని, నవీన్ కుమార్ మీద విషప్రయోగం జరిగిందని అనుమానం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.