Social media: లవర్స్, ఆంటీలు టార్గెట్, రేప్ చేసి సోషల్ మీడియాలో వీడియోలు!
చెన్నై/ కోయంబత్తూరు: కాలేజ్ అమ్మాయిలు, యువతులు, ప్రేమికులను బెదిరించి ప్రియురాలిపై, వివాహిత మహిళలపై అత్యాచారం చేస్తున్న సెక్స్ రాకెట్ ముఠా అరెస్టు అయినా ఆ ప్రాంతంలో ఇలాంటి దారుణాలు మళ్లీ బయటకు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండతో ఆ పార్టీ స్టూడెంట్ లీడర్స్, ఆ పార్టీ యువజన విభాగం నాయకులు ఇప్పటికే అరెస్టు అయ్యారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఈ గ్యాంగ్ రేప్ ముఠా ఇంతకాలం రెచ్చిపోవడం కలకలం రేపింది. బాధితులు ఎక్కడ మా విషయం బయటకు వస్తుందో అంటూ భయపడిపోతున్నారు.
Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!
కాలేజ్ అమ్మాయిలు
తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన పొల్లాచ్చిలో ఇటీవల కాలేజ్ లో చదువుకుంటూ ఏకాంతంగా గడపడానికి వెళ్లిన ప్రేమికులను బెదిరించి అమ్మాయిలపై అత్యాచారాలు జరిగాయి. కాలేజ్ అమ్మాయిలతో పాటు అమ్మాయిలు, వివాహిత మహిళల మీద పొల్లాచ్చిలో అనేక అత్యాచారాలు జరిగాయని వెలుగు చూడటంతో స్థానికులు, ప్రేమికులు హడలిపోయారు.
వైరల్ వీడియోలు
కాలేజ్ అమ్మాయిలు, యువతులు, వివాహిత మహిళలపై సామూహిక అత్యాచారం చేసే సమయంలో కొందరు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అన్నా మమ్మల్ని వదిలేయండి, ఇక ముందు ఇటువైపురాము అంటూ ఆ యువతులు వేడుకుంటున్న ఆడియో టేపులు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయ్యాయి.
పొల్లాచ్చి పరువు పోతుందని!
ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లాచ్చిలో పదేపదే గ్యాంగ్ రేపులు జరగడంతో స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు తూతూ మంత్రంగా రేప్ కేసులు విచారణ చేస్తున్నారని ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నాయకులకు రేప్ కేసులతో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. పొల్లాచ్చి రేప్ కేసుల విచారణ సీబీఐ చేతికి వెళ్లి పోయింది.
కాలేజ్ లీడర్స్ ముసుగులో
పొల్లాచ్చి రేప్ కేసుల్లో అన్నాడీఎంకే పార్టీ విద్యార్థి విభాగం కార్యదర్శి అరులాతలం, షేక్ బాబు, హెరాన్ పాల్ తో పాటు మరో ముగ్గురిని సీబీఐ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. నలుగురు రేప్ కేసు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి సీబీఐ అధికారుల ముందు సాక్షం చెప్పడంతో శబరిరాజ్, సతీష్, వసంతకుమార్, తిరునావక్కరసు, మణివన్నన్ తో సహ మొత్తం 8 మందిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి విచారణ చేసి వాళ్లను జైలుకు పంపించారు.
కాలేజ్ అమ్మయిలు, ఆంటీలు
కాలేజ్ అమ్మాయిలు, ప్రేమికులను బెదిరించి ప్రియురాళ్లను, వివాహిత మహిళలపై గ్యాంగ్ రేప్ లు చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. తమకు జరిగిన అన్యాయం గురించి నలుగురు బాధితులు సీబీఐ అధికారుల ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. కోయంబత్తూరు మహిళా కోర్టులో మరో యువతి రహ్యసంగా తన మీద రేప్ చేసిన వారి అనావళ్లతో పాటు కొందరి పేర్లు చెప్పి స్టేట్ మెంట్ ఇచ్చింది.
అందరూ ఫ్రెండ్స్?
స్థానిక పోలీసులు, రేప్ కేసు నిందితులు కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు రావడంతో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే కోర్టులో రహస్యంగా సాక్షం చెప్పిన యువతి చెప్పిన ఆధారంగా ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రేప్ లో అరెస్టు అయిన విద్యార్థి విభాగం నాయకులు, యువజన విభాగం నాయకులను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. అయినా మరో రెండు మూడు ఇలాంటి సంఘటనలు పొల్లాచ్చిలో జరిగాయని ఆరోపణలు రావడంతో పోలీసుల తీరుపై విమర్శలు ఎదురౌతున్నాయి.