Sister in law: విదేశాల్లో భార్య, మరదలి మీద మోజు పడిన బావకు బడిత పూజ, మత్తు మందు, వసీకరణ మందు!
చెన్నై/తిరుప్పూర్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. యువతి నర్సుగా ఉద్యోగం చేస్తోంది. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త మెడికల్ లోబరేటరిలో ఉద్యోగం చేస్తుంటే భార్య నర్సుగా ఉద్యోగం చేస్తోంది. కొంతకాలం తరువాత దంపతు మద్య చిన్న గొడవ జరగడంతో భార్య ఆమె పుట్టింటికి వెళ్లింది. పుట్టింటిలో ఉంటున్న భార్యకు విదేశాల్లోని ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగం రావడంతో ఆమె విదేశాలకు వెళ్లింది. భార్య విదేశాలకు వెళ్లిన తరువాత భర్త ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. కొన్ని నెలల తరువాత భార్య చెల్లిని లైన్ లో పెట్టిన భర్త ఆమెతో టచ్ లో ఉన్నాడు.
భార్య కంటే మరదలు అందంగా ఉండటం, భార్య విదేశాల్లో ఉండటంతో అతను మరదలిని లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే బావ వలలో పడకుండా భార్య తప్పించుకుని తిరిగింది. ఒంటరిగా వెలుతున్న మరదలి నోటిలో మత్తు మందు కలిపిన వసీకరణ మందు పోసి ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించి ఒక అడుగు ముందుకు వెయ్యడంతో అసలు కథ మొదలైయ్యింది.

లవ్ మ్యారేజ్
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని వాణియంబాడిల సమీపంలోని వూంగలం ప్రాంతంలో రాజేష్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు మూడు సంవత్సరాల క్రితం తన్మోళి (23) అనే యువతిని రాజేష్ ప్రేమించాడు. సంవత్సరం పాటు సంతోషంగా తిరిగిన ప్రేమికుు రాజేష్, తన్మోళి తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
ప్రేమ వివాహం చేసుకున్న రాజేష్, తన్మోళి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రాజేష్ వాణియంవాడిలోని ఆసుపత్రిలో మెడికల్ లోబరేటరిలో ఉద్యోగం చేస్తుంటే అతని భార్య తన్మోళి వేరే ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తోంది. కొంతకాలం తరువాత రాజేష్, తన్మోళి దంపతు మద్య చిన్న గొడవ జరగడంతో తన్మోళి కోపంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

విదేశాల్లో భార్య.... మరదిలిని లైన్ లో పెట్టిన భర్త
పుట్టింటిలో ఉంటున్న తన్మోళినికి విదేశాల్లోని ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగం రావడంతో ఆమె విదేశాలకు వెళ్లింది. భార్య తన్మోళి విదేశాలకు వెళ్లిన తరువాత రాజేష్ ఇక్కడే ఉద్యోగం చేసుకున్నాడు. విదేశాల్లో ఉన్న భార్య తన్మోళినికి ఆమె భర్త రాజేష్ ఫోన్ చేసి మాట్లాడుతతూ రాజీ అయిపోయాడు. కొన్ని నెలల తరువాత భార్య తన్మోళి చెల్లిని లైన్ లో పెట్టిన రాజేష్ ఆమెతో టచ్ లో ఉన్నాడు.

మరదలికి మత్తు మందు ఇచ్చి లొంగదీసుకోవాలని?
భార్య తన్మోళిని కంటే మరదలు అందంగా ఉండటం, భార్య విదేశాల్లో ఉండటంతో రాజేష్ అతను మరదలిని లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే బావ రాజేష్ వలలో పడకుండా మరదలు తప్పించుకుని తిరిగింది. ఒంటరిగా వెలుతున్న మరదలి నోటిలో మత్తు మందు కలిపిన వసీకరణ మందు పోసి ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన రాజేష్ స్కెచ్ రివర్స్ అయ్యింది.

బావకు బడిత పూజ
తన్మోళిని చెల్లెలులు గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు రాజేష్ ను పట్టుకుని చితకబాదేసి పోలీసులకు అప్పగించారు. మత్తు మందు, వసకీరణ ముందు తాగడంతో అస్వస్థతకు గురైన యువతిని ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మరదలిని లొంగదీసుకోవాలని ప్రయత్నించి రాజేష్ కు పోలీసులు బడిత పూజ చేస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications