నిలకడగానే ఎస్పీబీ ఆరోగ్యం.. చికిత్సకు స్పందిస్తున్నారు.. కానీ వెంటిలేటర్ సపోర్టుపైనే..
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఆస్పత్రి పేర్కొన్నది. ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారి.. చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యుల బృందం తెలిపింది. రాసి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడని కూడా వెల్లడించింది. అయితే అతనిని మరికొద్దిరోజులు వెంటిలేటర్ సపోర్టుపై ఉంచాలని తెలిపింది. అతనికి ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని వివరించింది.
ఫిజియోథెరపీ కూడా బాగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. బాలు ఆరోగ్యం గురించి తమ వైద్యుల బృందం నిశీతంగా గమనిస్తోంని తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం క్రమంగా మెరగవుతోందని బాలు కుమారుడు చరణ్ తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ ఫెక్షన్ క్రమంగా తగ్గుతోందని వెల్లడించారు. మీ అందరీ ప్రార్థనలతోనే తన తండ్రి ఆరోగ్యం మెరగవుతోందని చరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Recommended Video
బాలు త్వరగా కోలుకోవాలని చాలా మంది సినీ ఇండస్ట్రీకి చెందినవారు మేసెజ్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇలాయారాజా తన ఫేస్ బుక్ పేజీలో భావోద్వేగంతో వీడియో పోస్ట్ చేశారు. బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మ్యూజిక్ ప్రపంచంలో తమ స్నేహం ఎలా ఏర్పడిందనే అంశాన్ని ఇళయారాజా వివరించారు. అంతేకాదు తామిద్దరం ఒకరు స్వరం, మరొకరు రాగం అని గుర్తుచేశారు. త్వరలో ఓకే స్టేజీపై ఇళయరాజా, ఎస్పీబీ బాలులను చూడబోతున్నామని ఆశాభావంతో దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.