కరోనా బారిన పడిన తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్: హోం ఐసోలేషన్
చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్కు కరోనా పాజటివ్ అని తేలింది. ఆయనకు వైద్యం అందిస్తున్న కావేరి ఆస్పత్రి యాజమాన్యం ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. ఆయనను హోం ఐసోలేషన్లో ఉండాలని కోరినట్లు తెలిపింది.
ఇంటివద్దనే గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్కు చికిత్స అందిస్తామని సదరు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే గవర్నర్కు కరోనా సోకిందని వైద్యులు తేల్చారు.

ప్రస్తుతం కరోనా లక్షణాలతో బాధపడుతున్న గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కావేరీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తమిళనాడు రాజ్భవన్లో 87 మంది సిబ్బంది కరోనా బారినపడిన మరుసటి రోజే పురోహిత్ ఆస్పత్రిలో చేరారు.
సెక్యూరిటీ, ఫైర్ సర్వీస్ సిబ్బందితోపాట ఇతర 147 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 87 మందికి కరోనా ఉందని తేలినట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, తమిళనాడులో కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే.
Recommended Video
ఇప్పటి వరకు తమిళనాడులో 2,51,738 మందికి కరోనా సోకగా, 56,738 యాక్టివ్ కేసులున్నాయి. 1,90,966 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,034 మంది కరోనా బారినపడి మరణించారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications