Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పడవ ప్రమాదంపై జగన్ సీరియస్, బాధగా ఉందంటూ.. క్లియర్ కట్ ఆదేశాలు: మృతులకు 10లక్షల పరిహారం

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర జరిగిన ఘోర పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రమాద ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

అధికారులకు హెచ్చరిక

అధికారులకు హెచ్చరిక

ఇలాంటి పడవ ప్రమాదం జరగకుండా చేయగలిగితేనే ప్రయోజనం ఉంటుందని, లేదంటే.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం హెచ్చరించారు. ప్రమాద ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఏడాదికోసారి కాదు..

ఏడాదికోసారి కాదు..

పర్యాటక బోట్లను నడిపే ప్రాంతాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. లైసెన్సులు ఇచ్చి ఏడాదికోసారి కాకుండా నెలకోసారి బోట్లలో తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రక్షణ ప్రమాణాలను పాటించని బోట్లకు అనుమతివ్వకూడదని స్పష్టం చేశారు. ఆ ప్రమాణాలను సంబంధిత అధికారులు రూపొందించాలని అన్నారు.

బాధకు గురిచేసింది..

బాధకు గురిచేసింది..

ప్రైవేటు బోట్లపై అజమాయిషీ చేయలేనప్పుడు.. వాటన్నిటినీ రద్దు చేసి.. ప్రభుత్వ బోట్లనే నడపండి అని అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాణం విలువ మనం పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఒక ఏడాది పాప, ఆమె తండ్రి ఈ ప్రమాదంలో చనిపోయారు.. ఆ పాప తల్లి మాత్రం బతికి ఉంది. ఏం చేయాలో తెలియక ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అని చెప్పారు. ఈ ఘటన తనను ఎంతో బాధకు గురిచేసిందన్నారు.

మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు

మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు


పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు రూ. 10లక్షలు, గాయపడిన వారికి రూ. 3లక్షలు, పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారికి రూ. లక్ష పరిహారంగా ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మనం తప్పు చేశాం కాబట్టే ఈ డబ్బు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఈ ప్రమాద ఘటనపై కమిటీ కూడా వేస్తున్నామని తెలిపారు.

అధికారులకు ఆదేశాలు..

అధికారులకు ఆదేశాలు..

ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ప్రయాణికులు ఎంతమంది.. వారిలో ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు.. ఎంతమంది గల్లంతయ్యారనే వివరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఇతర కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు మృత దేహాలను బయటకి తీసే పనిలో ఉన్నాయని తెలిపారు.

9మంది మృతి.. 24మంది గల్లంతు..

9మంది మృతి.. 24మంది గల్లంతు..

ఇప్పటి వరకు 27మంది ప్రమాదం నుంచి బయటపడ్డారని, మిగిలినవారి కోసం బృందాలుగా ఏర్పాడి బలగాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం బోటులోని 60 మందిలో ఇప్పటి వరకు 9 మృతదేహాలు దొరికాయి. 24మంది గల్లంతయ్యారు. 27మంది ప్రమాదం నుంచి బటయపడ్డారు.

బాధితులకు పరామర్శ..

బాధితులకు పరామర్శ..

కాగా, అంతకుముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చలూరు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అండగా ఉంటామని బాధితులకు జగన్ భరోసా ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+