అంతుచిక్కని వ్యాధి... ఏలూరు బాధితులకు సీఎం జగన్ పరామర్శ... అండగా ఉంటామని భరోసా..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రిలో చేరిన బాధితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. సోమవారం(డిసెంబర్ 7) ఉదయం 10.30గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ఆయన... బాధితులు చికిత్స పొందుతున్న వార్డుకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులతో స్వయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
Recommended Video
ఈ క్రమంలో ఆస్పత్రి బెడ్పై ఉన్న ఓ బాలుడిని సీఎం జగన్ పరామర్శించగా... అతను రెండు చేతులెత్తి నమస్కరించే ప్రయత్నం చేశాడు. దీంతో బాలుడిని వారించిన జగన్ అతని నదుటిపై ముద్దు పెట్టాడు. బాధితులంతా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉ:టుందని జగన్ వారికి భరోసానిచ్చారు. బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులెవరికీ ఇన్ఫెక్షన్,జ్వరం లేదని వైద్యులు జగన్కు వెల్లడించారు.

ఏలూరులో నెలకొన్న ఈ పరిస్థితిపై సీఎం జగన్ జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లిలో గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.
కాగా,ఇప్పటివరకూ ఏలూరులో 345 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 28 మంది బాధితులు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. బాధితుల్లో 180 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్యులు వెల్లడించారు. శనివారం ఏలూరు పట్టణంలోని పడమరవీధి,తాపీమేస్త్రీ కాలనీ,శనివారం పేట,ఆదివారం పేట,కొత్తపేట,అరుంధతీ పేట స్థానికులు అస్వస్థతకు గురవగా... ఆదివారం మరికొన్ని కాలనీలకు ఈ వ్యాధి విస్తరించింది.

ఇందిరమ్మ కాలనీ,మరడాని రంగారావు కాలనీ,వైఎస్ఆర్ కాలనీలకు చెందిన స్థానికులు ఆదివారం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. దెందులూరు పరిధిలోని కేదవరానికి చెందిన నలుగురు వ్యక్తులు కూడా వింత వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అయితే స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందిన కొద్దిసేపటికే వారు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఎవరికి ప్రాణాపాయం లేదని అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
అంతుచిక్కని వ్యాధి... ఏలూరు బాధితులకు సీఎం జగన్ పరామర్శ... అండగా ఉంటామని భరోసా.. #AndhraPradesh #YSJagan #Eluru pic.twitter.com/NSk3FhpnIN
— oneindiatelugu (@oneindiatelugu) December 7, 2020
— oneindiatelugu (@oneindiatelugu) December 7, 2020
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications