ఏలూరు జిల్లాలో విషాదం; పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి; మరో ముగ్గురికి గాయాలు
ఏలూరు: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉపాధి కోసం కూలి పని చేసుకోవడానికి వెళ్ళిన వారిపై పిడుగు పడి నలుగురు కూలీలు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. నలుగురు కూలీలు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. బోగోలు లో జామాయిల్ తోట నరకడానికి దాదాపు 30 మంది కూలీలు పని కోసం వెళ్లారు. చెట్లు నరుకుతున్న ఈ క్రమంలో వారి పై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో నలుగురు కూలీల అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చెట్లను తొలగిస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన వారు కొండబాబు (35), ధర్మరాజు (20), రాజు (25), వేణు (18) గా గుర్తించారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూలీలు తోట పనులకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన గుడారాల కింద నివసిస్తున్నారు. తమ పనిచేసే నలుగురు మృతి చెందడంతో, మిగతా కూలీలు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదిలావుంటే ఇటీవల మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోనూ పిడుగుపాటుకు పలువురు మరణించారు. వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని విదిశా, సత్నా, గుణ జిల్లాలలో తొమ్మిది మంది పిడుగుపడి మరణించారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో పిడుగు పడి ఇంట్లో ఉన్న మహిళ తో పాటు ఆమె కుమారుడు మరణించారు. దాదాపు వారం రోజుల క్రితం చోటు చేసుకున్న పిడుగు పాట్ల దెబ్బ కు మొత్తం పది మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోనూ జోగులాంబ జిల్లాలో వేరు వేరు చోట్ల పిడుగు పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇటీవల ఈ తరహా మరణాలు ఎక్కువగా జరుగుతున్న నేపధ్యంలో వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద ఉండొద్దని సూచిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications