Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

health tips: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు తినాలి? ఆయుర్వేదం ఏం చెప్తుందంటే!!

ఆరోగ్యంగా ఉండటానికి భోజనం చేయడం ఎంత అవసరమో, ఏ సమయంలో భోజనం చేయాలి? రోజుకు ఎన్ని సార్లు భోజనం చేయాలి? ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి? వంటి అనేక నియమాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో విపరీతంగా బరువు పెరుగుతున్న చాలామంది, బరువును నియంత్రించడం కోసం ఉత్తమ ఆహారం పూర్తిగా శ్రద్ధ పెడుతున్నారు. ఈ క్రమంలో వారు సమతుల ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇదే సమయంలో అతిగా ఆహారం తీసుకున్నా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

ఆహారం ఎక్కువ తీసుకుంటే ఒబేసిటీ ప్రమాదం

ఆహారం ఎక్కువ తీసుకుంటే ఒబేసిటీ ప్రమాదం

ఆయుర్వేదంలో, అగ్ని మూలకాన్ని సమతుల్యంగా ఉంచాలని సూచించబడింది. మీరు రోజుకు 4-5 సార్లు తింటే, మీరు ఎల్లప్పుడూ ఆకలితో ఉన్నారని అర్థం అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మీరు రోజంతా ఆహారం తీసుకుంటే, మీరు బరువు పెరగడం ప్రారంభమవుతుందని, ఒక్కసారి బరువు పెరిగితే కంట్రోల్ చేసుకోవడం కష్టం అవుతుందని సూచిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఊబకాయం అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీని కోసం, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రోజుకు ఎన్నిసార్లు తినడం సరైనదో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

సన్నగా ఉన్నవారు రోజుకు ఎన్ని సార్లు తినాలంటే

సన్నగా ఉన్నవారు రోజుకు ఎన్ని సార్లు తినాలంటే

మీరు సన్నగా ఉండి, తరచుగా తినే అలవాటు ఉన్నట్లయితే, మీరు రోజుకు 4 సార్లు భోజనం చేయవచ్చు. అయితే నాలుగు సార్లు మితాహారం తీసుకోవాలని సూచించబడింది. రోజుకు 4సార్లు మితాహారం తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఆకలితో ఉన్నప్పుడు ఎంత ఆకలిగా ఉన్నప్పటికీ 80 శాతం తింటే ఆరోగ్యానికి మంచిది. సూర్యాస్తమయం తర్వాత అతిగా తినడం మానుకోండి. అలాగే, నిద్రించడానికి 3 గంటల ముందు రాత్రి భోజనం చేయాలని సూచిస్తున్నారు.

ఆరోగ్యవంతులు రోజుకు ఎన్ని సార్లు తినాలంటే

ఆరోగ్యవంతులు రోజుకు ఎన్ని సార్లు తినాలంటే

మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే, రోజుకు 3 సార్లు మాత్రమే ఆహారం తీసుకోండి. ఇది జీవనశైలి మరియు ఆహారం మధ్య సమతుల్యతను కాపాడుతుంది. దీని కోసం తేలికపాటి అల్పాహారం చేయండి. రాత్రిపూట కూడా పూర్తి భోజనం చేయకండి. తేలికపాటి రాత్రి భోజనం చేయండి. దీని తరువాత, అడపాదడపా ఉపవాసం చేస్తూ ఉండండి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి తేలికపాటి భోజనం చేయొచ్చని సూచిస్తున్నారు.

ఆయుర్వేదం , యోగా ప్రకారం రోజుకు ఎన్ని సార్లు తినొచ్చు అంటే

ఆయుర్వేదం , యోగా ప్రకారం రోజుకు ఎన్ని సార్లు తినొచ్చు అంటే

ఆయుర్వేదం మరియు యోగా ప్రకారం, రోజుకు రెండుసార్లు తినడం మంచిది. దీంతో భోజనం చేసేటప్పుడు 6 గంటల గ్యాప్ వస్తుంది. అలాగే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఆయుర్వేదంలో రోజుకు రెండు పూటలా భోజనం చేసే వ్యక్తిని భోగి అంటారు. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసే వ్యక్తిని యోగి అంటారు. ఇక ఉపవాసం చేయడానికి కూడా ఒక క్రమబద్దమైన నియమాలు ఉంటాయని, సాధారణ ప్రజలు దీర్ఘకాలం పాటు ఉపవాసం చేయకూడదని సూచిస్తున్నారు. ఏ సమయంలో ఆహారం తీసుకున్నప్పటికీ కచ్చితంగా ఆ ఆహారం పౌష్టికాహారమై ఉండాలని, ఈ విషయం ప్రధానంగా అందరు గుర్తుపెట్టుకోవాలని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+