గుంటూరు జిల్లాలో కంపించిన భూమి: గంట వ్యవధిలో మూడుసార్లు
గుంటూరు: గుంటూరు జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు నమోదయ్యాయి. గంట వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించింది. అమరావతి ప్రాంతం సీస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుందంటూ ఇదివరకు శివరామకృష్ణన్ కమిటీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో- అదే ప్రాంతంలో ఉన్న గుంటూరు జిల్లాలో గంట వ్యవధిలో మూడుసార్లు భూప్రకంపనలు నమోదు కావడం ఉలికిపడేలా చేస్తోంది. తాజాగా నమోదైన ఈ ప్రకంపనల తీవ్రత స్వల్పంగా ఉండటం కొంత ఊరట కలిగించినప్పటికీ- ఈ ప్రాంతం సీస్మిక్ జోన్-3 పరిధిలో ఉండటం వల్ల మున్ముందు భారీ భూకంపాలకు అవకాశం ఉండదనే అంచనాలు ఉన్నాయి.
ఈ ఉదయం గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7:15 నిమిషాల నుంచి గంట వ్యవధిలో అవి చోటు చేసుకున్నాయి. వాటి తీవ్రత తక్కువే. 7:15 నిమిషాలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.0గా నమోదైంది. ఆ తరువాత కూడా వరుసగా రెండుసార్లు భూమి ప్రకంపించింది. వాటి తీవ్రత 2.3, 2.7గా నమోదైనట్లు భూగర్భ నిపుణులు వెల్లడించారు. పులిచింతలతో పాటు తెలంగాణ సరిహద్దుల్లోనూ దీని తీవ్రత కనిపించింది. తెలంగాణలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలం, సూర్యపేట్లో స్వల్పంగా భూమి ప్రకంపించినట్టు నిర్ధారించారు.

భూపొరల్లో వస్తున్న మార్పుల కారణంగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయని అంచనా వేస్తోన్నారు. అమరావతి ప్రాంతం సీస్మిక్ జోన్ 3 పరిధిలోకి వస్తుందనేది తెలిసిన విషయమే. తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, వరంగల్ ఏపీలోని చిత్తూరు, కడప, గుంటూరు, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం సీస్మిక్ జోన్-3 పరిధిలోకి వస్తాయి. సీస్మిక్ జోన్-3 కింద కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయంటూ ఇదివరకే శివరామకృష్ణన్ కమిటీ చేసిన హెచ్చరికలు తాజాగా భూప్రకంపనలతో వార్తల్లోకి ఎక్కాయి. జోన్-3లో ఉన్న ప్రాంతాల్లో భూ ప్రకంపనలు తప్ప, భారీ భూకంపాలు సంభవించే అవకాశం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
-
ఐదేళ్ల తర్వాత అదరహో.. లాభాల బాటలో మిరప రైతులు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications